E-Paper
Advertisement

Vande Bharat Express: ప్రయాణికులకు విజ్ఞప్తి.. ఈ రూట్‌లో వందే భారత్ సహా 17 రైళ్లు రద్దు

Vande Bharat Express: ప్రయాణికులకు విజ్ఞప్తి.. ఈ రూట్‌లో వందే భారత్ సహా 17 రైళ్లు రద్దు
Advertisement

Indian Railways: రైల్వే పనుల కారణంగా పలు వందేభారత్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. మొత్తం 17 రైళ్లు క్యాన్సిల్ కాగా, మరో 4 రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు తెలిపారు. ఉత్తర ప్రదేశ్ లోని హర్దోయ్- బలమౌ మధ్య ఉన్న మసీత్ స్టేషన్‌ లో నాన్ ఇంటర్‌ లాకింగ్ పనులను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బరేలీ గుండా వెళ్లే 17 రైళ్లను క్యాన్సిల్ చేశారు. మరో నాలుగు రైళ్లను వేరే రూట్ కు మళ్లించారు. ఇంకో నాలుగు రైళ్లు రెండు గంటలకు పైగా ఆలస్యంగా నడవనున్నాయి. అంతకు ముందు, పొగమంచు కారణంగా డిసెంబర్ 1 నుంచి ఫిబ్రవరి 29 వరకు బరేలీ మీదుగా వెళ్లే 18 రైళ్లు ఇప్పటికే రద్దు చేయబడ్డాయి. రాబోయే మూడు నెలను దృష్టిలో పెట్టుకుని 40 రైళ్ల ఫ్రీక్వెన్సీని తగ్గించారు.

క్యాన్సిల్ చేసిన రైళ్ల వివరాలు   

Advertisement

⦿ సింగ్రౌలీ- తనక్‌ పూర్ మధ్యలో నడిచే త్రివేణి ఎక్స్‌ ప్రెస్(15073) డిసెంబర్ 21, 24 తేదీల్లో క్యాన్సిల్ అవుతుంది.

⦿ తనక్‌ పూర్- సింగ్రౌలి త్రివేణి ఎక్స్‌ ప్రెస్(15074) డిసెంబర్ 20, 23 తేదీల్లో రద్దు అవుతుంది.

Advertisement

⦿ శక్తినగర్- తనక్‌ పూర్ త్రివేణి ఎక్స్‌ ప్రెస్(15075) డిసెంబర్ 23న రద్దు చేయబడుతుంది.

⦿తనక్‌ పూర్- శక్తినగర్ త్రివేణి ఎక్స్‌ ప్రెస్(15076) డిసెంబర్ 22న రద్దు చేయబడుతుంది.

⦿ అర్చన ఎక్స్‌ ప్రెస్(12355/12356) డిసెంబర్ 21, 22 తేదీల్లో రద్దు చేయబడుతుంది.

లక్నోకు వెళ్లనున్న కుంభమేళా ఎక్స్‌ ప్రెస్

నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా హౌరా-డెహ్రాడూన్ కుంభమేళా(12369) ఎక్స్‌ ప్రెస్ డెహ్రాడూన్‌ కు బదులుగా డిసెంబర్ 22, 23 తేదీల్లో లక్నోకు నడుస్తుంది. ఈ రైలు రెండు రోజుల పాటు లక్నో, డెహ్రాడూన్ మధ్య రద్దు చేయబడుతుంది. అటు  డెహ్రాడూన్- హౌరా(12370) కుంభమేళా ఎక్స్‌ ప్రెస్ డిసెంబర్ 23, 24 తేదీల్లో లక్నో నుంచి డెహ్రాడూన్ వరకు నడుస్తుంది. ఈ రెండు రోజులు లక్నో, డెహ్రాడూన్ మధ్య రద్దు చేయబడుతుంది.

దారి మళ్లించిన నాలుగు రైళ్లు ఇవే!

⦿ డిసెంబర్ 22, 23 తేదీలలో సహర్స-అమృతసర్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ గోరఖ్‌ పూర్, సీతాపూర్, షాజహాన్‌ పూర్, బరేలీ మీదుగా మళ్లించబడుతుంది.

⦿ డిసెంబర్ 22న అమృత్‌ సర్- సహర్సా గరీబ్ రథ్ ఎక్స్‌ ప్రెస్ బరేలీ, షాజహాన్‌ పూర్, సీతాపూర్, గోరఖ్‌ పూర్ మీదుగా మళ్లించబడుతుంది. ఈ రైళ్లు లక్నో, హర్దోయ్‌ లో ఆగవు.

⦿ డిసెంబర్ 21 నుంచి 23 వరకు, ముజఫర్‌ పూర్- ఆనంద్ విహార్ ఎక్స్‌ ప్రెస్ గోండా, సీతాపూర్, షాజహాన్‌ పూర్ మీదుగా,  ఆనంద్ విహార్-ముజఫర్‌ పూర్ ఎక్స్‌ ప్రెస్ డిసెంబర్ 22, 23 తేదీల్లో షాజహాన్‌ పూర్, సీతాపూర్, గోండా  మీదుగా మళ్లించబడతాయి. ఈ రైళ్లు లక్నోకు వెళ్లవు.

రెండు గంటలు ఆలస్యంగా నడిచే రైళ్లు

⦿ జమ్మూ తావి- కోల్‌కతా ఎక్స్‌ప్రెస్,  చండీగఢ్- లక్నో ఎక్స్‌ప్రెస్ డిసెంబర్ 22న రెండు గంటలు ఆలస్యంగా బయల్దేరుతాయి.

⦿ అవధ్ అస్సాం ఎక్స్‌ ప్రెస్ డిసెంబర్ 22న 30 నిమిషాలు ఆలస్యంగా నడవనుంది. జమ్మూ తావి- కోల్‌కతా ఎక్స్‌ ప్రెస్  గంట 30 నిమిషాలు అదనంగా ఆగుతుంది.

Read Also: విమానాలకు ఎక్కువగా వైట్ కలర్ ఎందుకేస్తారు? న్యూజిలాండ్‌లో మాత్రం నల్ల రంగు ఎందుకు?

Related News

మొబైల్ నెంబర్‌లో ఒక్క అంకె తప్పు, కన్ఫార్మ్‌డ్ టికెట్ ఉన్నా.. రైలు నుంచి గెంటివేత, చివరికి..

ఇండిగో విమానానికి ప్రమాదం.. శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో ఘటన

రైలు సీటులో కూర్చొనే ముందు జాగ్రత్త.. భయంతో వణికిపోతున్న ప్రయాణికుడు

లేడీస్ డ్రైవ్ చేస్తారు.. లేడీసే ప్రయాణిస్తారు.. హైదరాబాద్‌లో ర్యాపిడో అదిరిపోయే Pink Bike సర్వీస్!

తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే రైళ్ల వేళలు మార్పు.. చెక్ చేసుకోపోతే ఇక అంతే!

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

Big Stories

Advertisement
×