BigTV English

Chenab Rail Bridge: ప్రపంచంలో ఎత్తైన రైల్వే వంతెనపై వందేభారత్‌ పరుగులు..ఇండియన్ రైల్వేలో సరికొత్త అధ్యాయం!

Chenab Rail Bridge: ప్రపంచంలో ఎత్తైన రైల్వే వంతెనపై వందేభారత్‌ పరుగులు..ఇండియన్ రైల్వేలో సరికొత్త అధ్యాయం!

Worlds Highest Railway Bridge: భారతీయ రైల్వే మరో అరుదైన ఘనత సాధించింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే వంతెనపై వందేభారత్ ఎక్స్ ప్రెస్ పరుగులు పెట్టింది. ఈ వంతెనపై తొలిసారి వందేభారత్ ట్రయల్ రన్ చేసింది. శ్రీమాతా వైష్ణోదేవి కత్రా స్టేషన్ నుంచి శ్రీనగర్ రైల్వే స్టేషన్ వరకు ఈ రన్ కొనసాగింది.


భారీగా తగ్గనున్న ప్రయాణ సమయం

భారత్ లోని ఇతర ప్రాంతాలకు జమ్మూకాశ్మీర్ కు రైల్వే కనెక్టివిటీని పెంచేందు కేంద్ర ప్రభుత్వం ఉధంపూర్‌- శ్రీనగర్‌-బారాముల్లా రైల్‌ లింక్‌(USBRL) నిర్మించింది. కాశ్మీర్ నుంచి న్యూఢిల్లీని కలిపే వందే భారత్‌ రైలును త్వరలో ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో ట్రయల్స్ నిర్వహించారు. ఢిల్లీ నుంచి నేరుగా కాశ్మీర్ కు రైల్వే ప్రయాణాన్ని అందించేలా 272 కిలో మీటర్ల మేర ఉధంపుర్‌- శ్రీనగర్‌- బారాముల్లా రైల్వే లింక్‌ ప్రాజెక్టుకు కేంద్రప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రీసెంట్ గానే ఈ ప్రాజెక్ట్‌ పూర్తయ్యింది. ఈ మార్గంలో వందేభారత్ రైలును నడపాలని నిర్ణయించారు. న్యూఢిల్లీ నుంచి బయల్దేరే వందేభారత్ రైలు అంజిఖాడ్ వంతెన, చీనాబ్‌ వంతెన మీదుగా ఉధంపూర్‌, జమ్ము, కత్రా మీదుగా వెళ్తాయి. సంగల్దాన్‌, బనిహాల్‌ మీదుగా నేరుగా శ్రీనగర్‌, బారాముల్లాకు చేరుకుంటాయి. ఈ రైల్వే మార్గం వల్ల రోడ్డు ప్రయాణంతో పోల్చితే సుమారు 6 గంటల సమయం ఆదా అవుతుంది. ప్రయాణం కూడా చాలా ఈజీగా మారుతుంది.


ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి

చీనాబ్ నదిపై కేంద్ర ప్రభుత్వం రైల్వే వంతెనను ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. స్టీల్, కాంక్రీట్ తో ఈ బ్రిడ్జిని నిర్మించారు. జమ్మూ డివిజన్ లోని రియాసి సెక్టార్ లో ఉంది. కశ్మీర్‌ ను భారత్‌ లోని మిగతా ప్రాంతాలతో కనెక్ట్ చేసేందుకు చేపట్టిన USBRL ప్రాజెక్టులో భాగంగా చీనాబ్‌ రైల్వే వంతెనను నిర్మించారు. ఈ వంతెన నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తున నిర్మించారు. 1,315 మీటర్ల పొడవు ఉంటుంది. పారిస్ లోని ఈఫిట్ టవర్ తో పోల్చితే ఈ బ్రిడ్జి 30 మీటర్లు ఎక్కువ ఎత్తులో ఉంటుంది.

కాశ్మీర్ లోయకు వందేభారత్ ప్రయాణం

ఇక న్యూఢిల్లీ నుంచి కాశ్మీర్ కు వందేభారత్ రైలు ద్వారా సేవలను అందించనున్నారు. అంతేకాదు, USBRL మార్గంలో నడిచేందుకు వందేభారత్ రైలును ఫైనల్ చేశారు. ఈ మార్గంలో నడిచే రైలుకు మిగతా వందేభారత్ రైళ్లతో పోల్చితే అదనపు ఫీచర్లను కలిగి ఉంటుంది. కాశ్మీర్ లో అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉంటాయి. బయట తీవ్రమైన మంచు కురుస్తున్నా చక్కటి విజుబులిటీతో రైలు ప్రయాణిస్తుంది. రైల్లోని ప్రయాణీకులకు చక్కటి వెచ్చదనాన్ని అందిస్తుంది. ఈ రైల్లోని నీరు గడ్డ కట్టకుండా తగిన ఏర్పాట్లు చేశారు.

టికెట్ల ధర ఎంతంటే?

ఇక ఢిల్లీ నుంచి కాశ్మీర్ కు వెళ్లే వందేభారత్ రైలుకు సంబంధించి టికెట్ ధర ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఆయా తరగతులను బట్టి రూ. 1,500, రూ. 2,100గా నిర్ణయించినట్లు సమాచారం. ఈ రైలు జమ్మూ, శ్రీమాతా వైష్ణోదేవి కత్రాలో హాల్టింగ్ తీసుకోనున్నట్లు తెలుస్తున్నది.

Read Also:  పర్వత గర్భంలో నుంచి వెళ్లే.. ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే టన్నెల్.. దాన్ని దాటేందుకు ఎంత టైమ్ పడుతుందంటే?

Related News

Mumbai Coastal Road: రూ. 12 వేల కోట్లతో మలుపుల రోడ్డు.. లైఫ్ లో ఒక్కసారైనా జర్నీ చేయండి!

Dirtiest railway stations: దేశంలోనే అత్యంత మురికిగా ఉన్న రైల్వే స్టేషన్లు ఇవేనట.. మీ స్టేషన్ కూడా ఉందా?

Railway history: ఈ రైలు వయస్సు 170 ఏళ్లు.. నేటికీ ట్రాక్ పై పరుగులు.. ఎక్కడో కాదు మన దేశంలోనే!

Railway passenger rules: రైల్వేలో ఈ రూల్ ఒకటి ఉందా? తెలుసుకోండి.. లేకుంటే ఇబ్బందే!

Vande Bharat Train: జర్నీకి పావుగంట ముందు.. IRCTCలో వందేభారత్ టికెట్స్ ఇలా బుక్ చేసుకోండి!

Hill Stations: హిల్ స్టేషన్స్ కు ఎగేసుకు వెళ్తున్నారా? అయితే, మీ పని అయిపోయినట్లే!

Big Stories

×