E-Paper
Advertisement

Vande Bharat HQ: వందే భారత్ హెడ్ క్వార్టర్ సెట్.. ఇక్కడి నుండే ఇకపై అన్నీ.. ఎక్కడంటే?

Vande Bharat HQ: వందే భారత్ హెడ్ క్వార్టర్ సెట్.. ఇక్కడి నుండే ఇకపై అన్నీ.. ఎక్కడంటే?

Vande Bharat HQ: ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్న వందే భారత్ రైళ్లకు ఇప్పుడు ఓ కేంద్ర బిందువు సిద్ధమైంది. కొత్తగా ఏర్పాటైన ఈ సెంటర్‌ నుంచే అన్ని కీలక నిర్ణయాలు, టెక్నికల్ మెయింటెనెన్స్, మానవ వనరుల శిక్షణ, భవిష్యత్తు ప్రణాళికలు రూపొందనుండటం విశేషం. కానీ ఆ కేంద్రం ఎక్కడా అని ఆలోచిస్తున్నారా? ట్రైన్ల వేగం మాత్రమే కాదు.. ఇప్పుడు ఇండియన్ రైల్వే దిశ కూడా మార్చబోతోంది. అసలు ఆ కేంద్రం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

వందే భారత్ ట్రైన్ మీకు నచ్చిందా? ఇకపై ఆ ట్రైన్‌కు మరింత మెరుగైన సేవలు, సమర్థవంతమైన నిర్వహణ, ప్రత్యేక శిక్షణ అన్నీ ఒకే చోట జరగబోతున్నాయి. భోపాల్‌ నిషాత్‌పురాలో రైల్వే ఒక భారీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. అదేమిటంటే..?

ఇండియన్ రైల్వే, దేశ వ్యాప్తంగా వందే భారత్ ట్రైన్లకు భారీ స్థాయిలో మరమ్మత్తులు, శిక్షణ సేవలు అందించే లక్ష్యంతో, మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌లోని నిషాత్‌పురా రైల్ కోచ్ ఫ్యాక్టరీలో రూ.150 కోట్ల వ్యయంతో ఓ సరికొత్త హబ్‌ను ఏర్పాటుచేస్తోంది. ఇది వందే భారత్‌కు డెడికేటెడ్ మెయింటెనెన్స్ ట్రైనింగ్ హబ్‌ కావడం విశేషం.

ఈ ప్రాజెక్ట్‌తో రైల్వే మౌలిక వసతులు మరింత బలోపేతం కానున్నాయి. ముఖ్యంగా వందే భారత్ ట్రైన్ల నిర్వహణలో సాంకేతిక పరంగా మరింత నాణ్యత, వేగవంతమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రణాళిక రూపొందించబడింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు చోట్ల వందే భారత్‌లు పరుగులు తీస్తుండగా, భవిష్యత్తులో మరిన్ని మార్గాల్లో వాటిని ప్రవేశపెట్టేందుకు ఇండియన్ రైల్వే సిద్ధమవుతోంది. అలాంటి క్రమంలో, ఈ హబ్ కీలక పాత్ర పోషించనుంది.

నిషాత్‌పురా కోచ్ ఫ్యాక్టరీకి కొత్త ఉత్సాహం
ఈ హబ్ వల్ల నిషాత్‌పురా రైల్వే వర్క్‌షాప్ స్థాయిలోనే ఓ పెద్ద మార్పు కనిపించనుంది. ప్రస్తుతం ఇక్కడ పాత కోచ్‌ల మరమ్మతులు జరిగితే, ఇకపై నూతన తరహా ట్రైన్ల నిర్వహణకూ ఇదే కేంద్రంగా మారనుంది. వందే భారత్ ట్రైన్‌ స్పెసిఫిక్ టెక్నాలజీకి అనుగుణంగా ప్రత్యేకంగా డిజైన్ చేసిన మెషీనరీ, ట్రైనింగ్ మాడ్యూళ్లు, సిములేటర్లు, స్పేర్ పార్ట్స్ వేర్‌హౌజ్‌లను ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు.

ఉద్యోగావకాశాలు మెండు..
ఈ మెగా ప్రాజెక్ట్‌తో భోపాల్ ప్రాంతానికి మరిన్ని ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ప్రత్యేకించి ఇంజినీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, ట్రైన్ ఆపరేషన్, శిక్షణ విభాగాల్లో ఉద్యోగుల అవసరం పెరుగుతుందని అంచనా. పలు కార్పొరేట్ ట్రైనింగ్ వర్క్‌షాపుల ద్వారా ఉద్యోగులకు నైపుణ్యాలను పెంపొందించనున్నారు.

వందే భారత్ భవిష్యత్ ప్రణాళికల్లో కీలకం
ఇప్పటికే దేశంలోని ప్రధాన మార్గాల్లో వందే భారత్‌లు సేవలందిస్తున్నాయి. భవిష్యత్తులో రాష్ట్రాలు అంతటా ఈ ట్రైన్ల విస్తరణ జరుగుతుందని కేంద్ర రైల్వే శాఖ చెబుతోంది. అటువంటి వేగవంతమైన, నూతనమైన రైళ్ల నిర్వహణకు ప్రత్యేకంగా ఏర్పడుతున్న కేంద్రాల్లో భోపాల్‌ హబ్ ఒక ఆధారస్తంభంగా నిలవనుంది. కొత్తగా నిర్మించనున్న ఈ కేంద్రం 24×7 ఆధునిక ఫెసిలిటీగా పనిచేయనుంది.

Also Read: Tirupati special trains: టికెట్లు దొరకడం కష్టం అనుకోవద్దు.. తిరుపతికి కొత్త స్పెషల్ రైళ్లు రెడీ!

పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా
ఈ ప్రాజెక్ట్ గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్‌తో నిర్మించబడనుంది. నూతన ఇన్ఫ్రాస్ట్రక్చర్‌లో సౌర విద్యుత్ ప్యానల్స్, రీసైక్లింగ్ యూనిట్లు, వర్షనీటి సంరక్షణ, వీలైనంతవరకూ ప్లాస్టిక్ వాడకానికి నిరోధం వంటి పలు పర్యావరణ పరిరక్షణ చర్యలు తీసుకోనున్నారు.

రైలు ప్రయాణికులకూ ప్రయోజనం
ఈ కేంద్రం ఏర్పాటు వల్ల ప్రయాణికులకూ ప్రత్యక్ష ప్రయోజనం ఉండనుంది. వందే భారత్ రైళ్ల నిర్వహణ మరింత సమర్థవంతంగా జరిగితే, రైళ్ల ఆలస్యం, సాంకేతిక సమస్యలు తక్కువగా ఉంటాయి. శుభ్రత, సౌకర్యాలు, సురక్షిత ప్రయాణం వంటి అంశాల్లో నాణ్యత మెరుగవుతుంది.

ఈ విధంగా, నిషాత్‌పురాలో ఏర్పాటు కాబోతున్న వందే భారత్ మెయింటెనెన్స్ ట్రైనింగ్ హబ్, ఇండియన్ రైల్వేకు ఒక మైలురాయి. రూ.150 కోట్ల బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కావడం, భారత రైల్వే అభివృద్ధికి దిక్సూచి అనే చెప్పాలి. ఇది కేవలం ఓ సాంకేతిక కేంద్రం మాత్రమే కాదు, భవిష్యత్తు ట్రైన్ సేవల అభివృద్ధికి పునాదిగా రైల్వే అంటోంది.

Related News

సముద్ర గర్భంలో సైకిల్ సవారీ.. విశాఖలో అరుదైన సాహసం!

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

Big Stories

×