E-Paper
Advertisement

Railway Tracks: రైల్వేలో ముందు కొత్త ట్రాక్ వేయరు, ఎందుకో తెలుసా?

Railway Tracks: రైల్వేలో ముందు కొత్త ట్రాక్ వేయరు, ఎందుకో తెలుసా?
Advertisement

Indian Railways: గత కొంతకాలంగా దేశంలో వందలాది కిలో మీటర్ల మేర రైల్వే ట్రాక్ ల నిర్మాణం జరుగుతున్నది. జమ్మూకాశ్మీర్ సహా దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రైల్వే ట్రాక్ లను ఏర్పాటు చేస్తున్నారు. ఒక రైల్వే ట్రాక్ నిర్మించే సమయంలో అధికారులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అన్నింటికంటే ముఖ్యం.. తొలుత ట్రాక్ ఏర్పాటు చేసే సమయంలో కొత్త ట్రాక్ వేయరు. దాని స్థానంలో ఫిష్ ప్లేటేడ్ ట్రాక్ వేస్తారు. అంటే పాత పట్టాలతో కూడిన ట్రాక్ కు నిర్మిస్తారు. ఆ తర్వాత వీటిని తీసేసి కొత్త ట్రాక్ ను నిర్మిస్తారు. ఒకేసారి కొత్త ట్రాక్ వెయ్యొచ్చు కదా? అదనపు ఖర్చు ఎందుకు దండగ అని చాలా మంది భావిస్తారు. కానీ, దీనికి ఓ కారణం ఉంది. ఇంతకీ అదేంటంటే..

రైలు పట్టాల తరలింపు కోసం ఫిష్ ప్లేటేడ్ ట్రాక్ నిర్మాణం

Advertisement

కొత్తగా వచ్చే రైలు పట్టాలు ఒక్కోటి 250 మీటర్లు ఉంటాయి. వీటిని రోడ్డు మార్గం ద్వారా తరలించడం అనేది సాధ్యం అయ్యే పని కాదు. అందుకే, ప్రత్యేమైన రైలు ద్వారా వీటిని తీసుకొస్తారు. ఈ రైలు వచ్చేందుకు ఫిష్ ప్లేటెడ్ ట్రాక్ వేస్తారు. ఈ ట్రాక్ మీద 20 RP బీటెడ్ ట్రైన్ వస్తుంది. ఈ రైలులో మాత్రమే రైలు ప్యానెల్స్ ను తీసుకొస్తారు. ఈ పట్టాలు వచ్చిన తర్వాత.. దాన్ని తొలగించి కొత్త ట్రాక్ ను వేస్తారు. ఫిష్ ప్లేటెడ్ ట్రాక్ నిర్మాణం అనేది పట్టాలను తీసుకొచ్చేందుకు చేసే ప్రయత్నంలో భాగం భావిస్తారు రైల్వే అధికారులు.

ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే వ్యవస్థలలో ఒకటి

Advertisement

భాతీయ రైల్వే సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థలలో ఒకటిగా కొనసాగుతున్నది. సుమారు లక్ష కిలో మీటర్లకు పైగా ఉన్నా రైల్వే లైన్ల మీద నిత్యం 20 వేలకు పైగా రైళ్లు రాకపోకలు కొనసాగిస్తుంటాయి. రోజుకు సుమారు 2.5 కోట్ల మంది ప్రయాణీకులు ఈ రైళ్ల ద్వారా రాకపోకలు కొనసాగిస్తుంటాయి. తక్కువ ఖర్చులో ప్రయాణీకులకు ఆహ్లాదకర ప్రయాణాన్ని అందించడంతో ఎక్కువగ మంది రైలు ప్రయాణాన్ని ఇష్టపడుతుంటారు.

దశాబ్దకాలంగా రైల్వేలో భారీ పురోగతి

ఇక గత దశాబ్ద కాలంలో భారతీయ రైల్వే గణనీయమైన పురోగతి సాధిస్తోంది. దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లను  పునర్నిర్మించడంతో పాటు అత్యాధునిక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నది కేంద్ర ప్రభుత్వం. ఇందుకోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నది. సరికొత్త రైల్వే డిజవిజన్లను ఏర్పాటు చేస్తున్నది. వందేభారత్ లాంటి సెమీ హైస్పీడ్ రైళ్లు భారతీయ రైల్వే ముఖచిత్రాన్ని మార్చివేశాయి. ప్రయాణీకులు అత్యాధునికి వసతులు కల్పించడంతో పాటు వేగవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తున్నాయి. అటు నమోభారత్ రైళ్లు మెట్రో ప్రయాణాల్లో గణనీయమైన మార్పులు తీసుకొచ్చాయి. త్వరలోనే వందేభారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రాబోతున్నాయి. హైడ్రోజన్ రైళ్లు, బుల్లెట్ రైళ్లను ప్రజలకు పరిచయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు భారతీయ రైల్వే సంస్థ ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది.

Read Also: రైల్వేలో W/D బోర్డులు కనిపిస్తాయి.. వీటిని ఎందుకు ఏర్పాటు చేస్తారో తెలుసా?

Related News

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

ప్రయాణికులకు అలర్ట్.. 36 రోజుల పాటు రైళ్లకు అంతరాయం!

రైలులో సిగరెట్ తాగిన వేస్ట్ ఫెలో.. ఒక్కసారే రైల్లో అలజడి, ఏమైందా అని చూస్తే..

రూ.50 వేల బడ్జెట్‌లో ఫారిన్ ట్రిప్.. భారతీయుల కోసం ఈ 7 దేశాలు బెస్ట్

200 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో ఆడపిల్ల.. రథంపై ఊరేగించి ఘన స్వాగతం!

అందంగా కనిపిస్తాయి.. కానీ, అడుగు పెడితే అంతే సంగతులు!

Big Stories

Advertisement
×