Kissik Talks:బిగ్బాస్ హౌస్లో ఉన్నప్పుడు తన మాట తీరు, స్ట్రైట్ఫార్వర్డ్ యాటిట్యూడ్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సోనియా ఆకుల.. ఇప్పుడు బయట కూడా తన మాటలతో ఆసక్తి రేపుతోంది. తాజాగా కిస్సిక్ టాక్స్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన వ్యక్తిగత జీవితం, సేవా కార్యక్రమాలు, తనభక్తి, నమ్మకాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది.ఈక్రమంలో ఒక కేంద్ర మంత్రి ఏకంగా తనకి ఫోన్ చేశాడని చెప్పడం ఇపుడు నెట్టింట వైరల్ అవుతుంది.
సోనియా చేస్తున్న సేవా కార్యక్రమాలను చూసిన ఓ కేంద్ర మంత్రి తనకు ఫోన్ చేశారని ఆమె చెప్పుకొచ్చింది. తనతో మాట్లాడిన ఆ కేంద్ర మంత్రి.. “నీ గొంతు పార్లమెంట్లో ఉండాలి” అని అన్నాడని అసలు విషయం బయటపెట్టింది.సాధారణంగా సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల మధ్య జరిగే పరిచయాల గురించి చాలా విషయాలు బయటకు రావు. కానీ సోనియా చెప్పిన ఈ విషయం మాత్రం ఆసక్తిని పెంచుతోందనే చెప్పాలి.
also read :బిగ్బాస్ హౌస్లో తనకు ఎదురైన ఘటనపై సోనియా ఆకుల ఓపెన్
ఇక ఇదే ఇంటర్వ్యూలో సోనిమా మాట్లాడుతూ మరో ఆసక్తికరమైన విషయాన్ని కూడా బయట పెట్టింది. తనకు ఇష్టమైన దేవుడు ఎవరు అని అడిగినప్పుడు దుర్గామాత అని చెప్పినట్లు తెలిపింది సోనియా ఆకుల.దుర్గామాత లో ఉన్న శక్తి, ధైర్యం తనకి ఎంతో ఇష్టమని,ముఖ్యంగా తనకి సీవియర్ బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు దుర్గామాతే తనని ఆదుకుందని,అందుకే ఆ దేవత అంటే తనకి అంత ఇష్టమని వివరించింది.
ఇక సోనియా ఆకుల సినీ కెరీర్ విషయానికి వస్తే 2019లో వచ్చిన జార్జ్ రెడ్డి సినిమాలో జార్జ్ రెడ్డి చెల్లిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సోనియా 2019లో వచ్చిన కరోనా వైరస్ అనే సినిమాలో శాంతి అనే పాత్రని పోషించింది.అలాగే 2021లో వచ్చిన ఆశ ఎన్కౌంటర్ సినిమాలో దిశ అనే పాత్రని పోషించిన సోనియా చివరిగా 2025లో కిల్లర్ ఆర్టిస్ట్ అనే సినిమాలో చివరిగా నటించింది.
also read :సోనియా ఆకుల భర్త బ్యాక్గ్రౌండ్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
మొత్తానికి “పార్లమెంట్లో నీ గొంతు ఉండాలి” అని అన్న ఆ కేంద్ర మంత్రి ఎవరై ఉంటారు?బ్యాక్ పెయిన్ సమయంలో ఏం జరిగింది? అనే ప్రశ్నలకు పూర్తి సమాధానాలు వచ్చే ఆదివారం 8-30 కి టెలీకాస్ట్ అయ్యే పూర్తి ఇంటర్వ్యూలో దొరికే అవకాశం ఉంది.