Amaravati Development: అమరావతి పునర్నిర్మాణంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 65వ సీఆర్డీఏ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. 5వందల 96 కోట్లతో లైబ్రరీ, కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు సీఆర్డీఏ ఆమోదం తెలిపింది. అలాగే మొత్తం 14వందల 30 కోట్లతో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.రాజధాని అమరావతి నుంచి మంగళగిరికి తాగునీరు అందించేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. మరోవైపు జనవరి 6, 2026కు ముందు రుణాలు తీసుకున్న రెండో దశ భూసమీకరణ రైతులకు కూడా రుణమాఫీ వర్తింపజేసేందుకు సీఎం చంద్రబాబు సమ్మతించారు.
Also Read: పంచదార్ల కొండ మైనింగ్ రగడకు ఎండ్.. లీజును రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం!
అమరావతిలోని 29 గ్రామాల లేఅవుట్ రోడ్లను బీటీ రోడ్లుగా మార్చేందుకు కూడా అనుమతులు ఇచ్చారు. ఎల్పీఎస్ రోడ్లను సీసీ రోడ్లకు బదులుగా బీటీ రోడ్లుగా అభివృద్ధి చేయనున్నారు. దీంతో రాజధాని గ్రామాల్లో రహదారి కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది. మొత్తంగా.. అమరావతిలో అభివృద్ధి పనులకు వరుసగా గ్రీన్సిగ్నల్స్ ఇస్తోంది సీఆర్డీఏ. వేల కోట్ల విలువైన మౌలిక వసతులు.. కొత్త రోడ్లు.. లైబ్రరీ, కన్వెన్షన్ సెంటర్.. తాగునీటి వసతులు.. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు.. ఇలా రాజధాని నిర్మాణానికి సంబంధించిన కీలక నిర్ణయాలు 65వ సీఆర్డీఏ సమావేశంలో తీసుకున్నారు.
Also read: స్థానిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ జనసేన అల్టిమేటం.. సీట్ల పంపకాలపై పవన్ బిగ్ క్లారిటీ!