Subhash Chandra: కార్పొరేట్ దిగ్గజాలకు బ్యాంకింగ్ చట్టాలు చుట్టరికమని ఈ ఘటన మరోసారి ప్రూ చేసింది. జీ ఫౌండర్ సుభాష్ చంద్ర 22వేల కోట్ల బకాయిలుంటే.. ఆరున్నర కోట్లు చెల్లిస్తే చాలంటూ NCLT డిసైడ్ చేయడం సంచలనంగా మారింది. దీనిపై లండన్లో ఉన్న విజయ్ మాల్యా సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. ఒకే దేశంలో రుణాలు వసూలు చేసేందుకు రెండు రకాల చట్టాలు ఉన్నాయా అని మాల్యా నిలదీశారు.
NCLT ఆమోదించిన ఈ సెటిల్మెంట్పై కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ తీవ్రంగా స్పందించారు. ఇది బ్యాంకుల హెయిర్ కట్ కాదని, ప్రజాధనానికి పెట్టిన గుండు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సామాన్యుడు చిన్న రుణం కట్టకపోతే ఇళ్లను, ఆస్తులను జప్తు చేసే బ్యాంకులు.. వేల కోట్ల ప్రజాధనాన్ని ముంచిన బడా బాబులకు మాత్రం సెటిల్మెంట్ పేరిట దోచిపెడుతున్నాయని మండిపడ్డారు.
Also rerad: దొరకుంట వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నుజ్జునుజ్జు.. అతివేగమే కొంప ముంచిందా..!
ఈ నిర్ణయంతో ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్కు గట్టి షాక్ తగిలింది. సుభాష్ చంద్ర నుంచి ఎల్ఐసీకి ఏకంగా 13వందల 22 కోట్లు రావాల్సి ఉండగా.. ఈ సెటిల్మెంట్ ప్లాన్ ప్రకారం దక్కేది కేవలం 38 లక్షల రూపాయలే.. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎల్ఐసీ చట్టపరమైన పోరాటానికి సిద్ధమైంది. బ్యాంకింగ్ రికవరీ విధానంలో అందరికీ సమాన న్యాయం ఎక్కడుందన్న మాల్యా ప్రశ్నలు, కాంగ్రెస్ విమర్శలతో ఈ వివాదం పొలిటికల్ హీట్ పెంచింది. కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటాయో వేచి చూడాలి.
Also read: కొరివితో తలగోక్కోవడం అంటే ఇదే మరి… వైరల్ వీడియో కోసం వెళ్ళి 1500 ఏళ్ల దుష్టశక్తిని నిద్ర లేపారు