Kissik Talks:తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 లోకి కామనర్ గా అడుగుపెట్టిన వారిలో ప్రియాశెట్టి కూడా ఒకరు. ఈమె రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు ప్రాంతవాసి. బిగ్ బాస్ అగ్ని పరీక్ష ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియా మూడో వారమే ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చేసింది. అలా మూడు వారాలకు గాను రూ 2.10 లక్షల రూపాయల వరకు పారితోషకం అందుకుంది. తాజాగా బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియా శెట్టి హౌస్ లో తనకి ఎవరు ఇష్టం? తన బాయ్ ఫ్రెండ్ ఎలా ఉండాలి? సమాజంలో అమ్మాయిలు ఎలా ఉండాలి? తన తండ్రి ఆరోగ్య పరిస్థితులు? ఇలా ఎన్నో విషయాలతో పాటు మరికొన్ని పర్సనల్ విషయాలను పంచుకుంది.
ముఖ్యంగా హౌస్ లో తనకి కళ్యాణ్ అంటే చాలా ఇష్టమని , అలాగే తన బాయ్ ఫ్రెండ్ కూడా డార్క్ కలర్ లో ఉంటే చాలా ఇష్టమని చెప్పిన ఈమె.. అబ్బాయిల లవ్ ఫెయిల్యూర్ విషయం గురించి మాట్లాడుతూ.. అబ్బాయిలు ఒక్కసారి లవ్ చేసి నాది అనుకున్నారు అంటే, వాళ్లు చాలా కనెక్ట్ అయిపోతారు . డిప్రెషన్ కి గురవుతారు అంటూ తెలియజేసింది. ఫస్ట్ లవ్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్ లో చాలా ఇంపార్టెంట్. ఆ లవ్ మన చేతుల్లోనే ఉంటుంది . దానిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని తెలిపింది.
also read:Kissik talks: నేను రొమాంటిక్.. అలాంటి వాడే భర్తగా రావాలి.. ప్రియా శెట్టి కోరికలు మామూలుగా లేవుగా!
ఫ్రెండ్షిప్ అయినా, లవ్ అయినా రెండు పక్కల నుంచి బలంగా ఉంటేనే అది సక్సెస్ అవుతుంది. అలాగే తాను కర్మని చాలా నమ్ముతానని, నువ్వు ఏది చేస్తే అది ఖచ్చితంగా రిటర్న్ వస్తుంది, ఒకరిని నువ్వు బాధ పెట్టావు అంటే, దానికి పది రెట్లు నువ్వు బాధపడతావు. ఇది 100% నిజం అంటూ తెలిపింది. ఇక తండ్రి గురించి మాట్లాడుతూ.. తండ్రి లేకపోతే ఏదో తెలియని బాధ ఉంటుంది, బాయ్ ఫ్రెండ్ దగ్గర నుంచి స్నేహితుల దగ్గర నుంచో అంతే ప్రేమను కోరుకుంటారని, అలాగే తన తండ్రి ఎదుర్కొన్న కష్టాల గురించి అడగగా.. తన తండ్రికి పోలియో ఉందని, ఏదో ఒక ఫంక్షన్ కి వెళ్లి కింద పడ్డారు. తన తండ్రికి ఆ సమయంలో థై బోన్ ఫ్రాక్చర్ అయ్యింది. లోపల, హాస్పిటల్ కి వెళ్ళగానే నన్ను చూసి మా నాన్న చాలా ఏడ్చారని తెలిపింది. అయితే తన తండ్రిని ఒక్కసారిగా అలా చూసేసరికి ఆ క్షణం చనిపోవాలనిపించిందని తన బాధను వ్యక్తపరిచింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈమె చేసిన ఎమోషనల్ కామెంట్లకు ప్రేక్షకులు కన్నీటి పర్యంతమవుతున్నారు