Duvvada Madhuri: ప్రతి ఒక్కరి లైఫ్లో సెకండ్ ఛాన్స్ అనేది ఒకటి ఉంటుంది.. మనం పుట్టిన తర్వాత లైఫ్లో ఏదో ఒకటి సాధించి పోవాలని అంటున్నారు ఫైర్ బ్రాండ్ దువ్వాడ మాధురి (Duvvada Madhuri). తాజాగా ఆమె బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ (Big TV Kissik Talks) పాడ్ క్యాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకునే వారి గురించి, మనీ-రిలేషన్స్ గురించి, ఇంకా ఆస్తులన్నీ లాగేసుకుని, తల్లిదండ్రులను గెంటేసే వారి గురించి ఆమె మాట్లాడుతూ..
‘‘లైఫ్లో సెకండ్ ఛాన్స్ అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి, ఎప్పుడూ ఒకే దగ్గర ఆగిపోకూడదు. ఇది దేవుడు మీకు ఇచ్చిన జీవితం, మీరే హ్యాపీగా బతకడానికి. ఎవరి కోసమో మన లైఫ్ కోల్పోవడానికి కాదు. మనం పుట్టిన తర్వాత లైఫ్లో ఏదో ఒకటి సాధించి పోవాలి తప్పితే, ఏమీ లేకుండా పోవడం వల్ల మన లైఫ్కి అసలు ఉపయోగమే లేదు. హ్యాపీగా పెళ్లి చేసుకోండి, హ్యాపీగా ఉండండి. అంతే కానీ ఆత్మహత్య వంటి నిర్ణయాలు అసలు తీసుకోకూడదు. మనల్ని నమ్మి మన పేరెంట్స్ ఉంటారు, తర్వాత పిల్లలు ఉంటారు. ఇప్పుడు నేనే ఉన్నాను, నేనేమైనా అయిపోయి ఉంటే నా పిల్లలు ఏమైపోయి ఉండేవారు? నా పేరెంట్స్ ఏమైపోయి ఉండేవారు? ఇప్పుడు అందరం హ్యాపీగా ఉన్నాం కదా!
Also Read- చిరంజీవిని ఏమైనా అంటే.. కచ్చితంగా నాశనమైపోతారు- వివి వినాయక్
లైఫ్లో మనీ కూడా చాలా ఇంపార్టెంట్. మనీ లేకున్నా లైఫ్ లీడ్ చేయడం చాలా కష్టం. మనీ లేకపోతే ఒక స్టెప్ కూడా బయటకి వేసి వెళ్లడం చాలా కష్టం. డబ్బులు లేకుండా బ్రతికేస్తాం, ప్రేమ ఉంటే చాలు.. అవన్నీ స్టోరీస్, సినిమాల్లో చూడటానికి బాగుంటాయి కానీ, డబ్బు లేకపోతే జీవితం చాలా కష్టం. అందుకే అంటున్నా.. డబ్బు సంపాదించుకున్న తర్వాత ప్రేమలు దోమలు చూసుకోండి కానీ, లైఫ్ లో మనీ అనేది చాలా ఇంపార్టెంట్. రిలేషన్స్ కూడా ఇంపార్టెంట్.. రెండూ ఇంపార్టెంట్, రెండూ బ్యాలెన్స్ చేసుకోవాలి.
Also Read- తిరుమల కేక్ వివాదంపై మాధురి క్లారిటీ.. నేనెవరికీ క్షమాపణ చెప్పలేదు.. చెప్పనంటూ..
అలా గెంటేస్తే.. రేపు పొద్దున్న నీ పిల్లలు నిన్ను కూడా అదే చేస్తారు కదా! మరి నిన్నేం చేస్తారు వాళ్ళు పెద్దయ్యాక, వాళ్ళ పెళ్లిళ్లు అయ్యాక? నిన్ను కూడా సేమ్ అదే చేస్తారు. మనం ఏం చేస్తే మన పిల్లలు మన దగ్గర నుంచి అదే నేర్చుకుంటారు. ఇప్పుడు నేను నా అత్తమామలను గెంటేసాను అనుకోండి, రేపు పొద్దున్న నా పిల్లలు ఏం చేస్తారు? వాళ్ళు కూడా అలాగే చేస్తారు సేమ్ సిట్యుయేషన్ కదా! సో.. రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్ డబ్బుతో పాటు. ఒక్క డబ్బుతోనే మనం లైఫ్ గడపలేము కదా! కష్టం, మన హ్యాపీనెస్ ని గానీ, మన బాధను గానీ షేర్ చేసుకోవడానికి మన అనుకునే వాళ్ళు కచ్చితంగా మన పక్కన ఎవరో ఒకరు ఉండాలి. అలా లేనప్పుడు.. ఆ జీవితం చాలా చప్పగా ఉంటుంది. నాకైతే చుట్టూ జనాలు ఉంటేనే ఇష్టం. ఎప్పుడూ నా చుట్టూ 10, 20 మంది ఉండాలి. ఒక్కదాన్ని ఉండటం నాకసలు నచ్చదు..’’ అని దువ్వాడ మాధురి చెప్పుకొచ్చారు.
Also Read- దువ్వాడలో ఆ క్వాలిటీ చూసి పడిపోయానన్న మాధురి .. తన కాలి గోటికి సరిపోరంటూ!