Intinti Ramayanam Pranathi : స్టార్ మా ఛానెల్లో ప్రసారం అవుతున్న సీరియల్స్ అన్ని కూడా టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్నాయి. అందులో కొన్ని మాత్రం స్టోరీతో బాగా ఆకట్టుకోవడంతో ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.. ప్రతి రోజు టీవీ ఛానెల్స్ లలోకి చాలా సీరియల్స్ వస్తుంటాయి. ప్రస్తుతం టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న డైలీ సీరియల్స్ లలో ఇంటింటి రామాయణం ఒకటి.. స్టార్ మా లో ప్రసారం అవుతున్న టాప్ 3 రేటింగ్ సీరియల్ ఇది.. ఇందులో బిజినెస్ మ్యాన్ రాజేంద్ర ప్రసాద్ కూతురు పాత్రలో ప్రణతి నటించింది. గత కొన్ని రోజుల క్రితం ఈ సీరియల్ కు ఈమె క్యారక్టర్ కీలక మలుపు తిప్పింది.. ఈ పాత్రలో నటించిన ఆమె పేరు ప్రియా ప్రసాద్.. ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఆమె లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఒక్క సీరియల్ కు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందో ఒకసారి తెలుసుకుందాం..
సీరియల్ యాక్టర్ ప్రియా ప్రసాద్ బుల్లితెరపై ప్రసారం అవుతున్న పలు సీరియల్స్ లలో నటించింది. ఈమె ప్రస్తుతం ఇంటింటి రామాయణం సీరియల్ లో కూతురు పాత్రలో నటిస్తుంది. మొదటగా ఎంతో సాఫ్ట్ గా ఉండే ఈమె ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి జరుగుతున్న సమయంలో లేచిపోతుంది. కానీ ఆ అబ్బాయి ఇంటికి వెళ్తుంది. కానీ అక్కడ వాడు ఉండడు. దాంతో ఆమె మోసపోయాను అని తెలుసుకొని చనిపోవాలని అనుకుంటుంది. తన వదిన కాపాడి ఉత్తుత్తి పెళ్లి జరిపిస్తుంది. ఆ తర్వాత సీరియల్ లో ఎన్నో ట్విస్ట్ లు మొదలవుతాయి. ఇప్పుడు ఈ సీరియల్ కు కీలక పాత్ర అవుతుంది. ఈ అమ్మడు గతంలో పలు సీరియల్స్ లలో నటించింది. ఇంటింటి రామాయణం సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.. ప్రియా ప్రసాద్ రెమ్యూనరేషన్ గురించి ఓ వార్త నెట్టింట వినిపిస్తుంది. ఆ ఒక్క రోజుకు 15 వేలు తీసుకుంటుందని సమాచారం.. ఆ లెక్కన నెలకు లక్షల్లో సంపాదిస్తుంది.
Also Read : రాజమౌళి ఏళ్ల నాటి సెంటిమెంట్ ను మహేష్ బ్రేక్ చేస్తాడా..?
బుల్లితెర నటి ప్రియా ప్రసాద్ గతంలో చాలా సీరియల్స్ లలో నటించింది. ఈమె జీ తెలుగులో బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న చి ల సౌ లక్ష్మీ సౌభాగ్యవతి లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత స్టార్ మా లో ప్రసారం అయిన మరో సూపర్ హిట్ సీరియల్ ఏటో వెళ్ళిపోయింది మనసులో నటించింది. ఇప్పుడు ఇంటింటి రామాయణంలో నటిస్తుంది. దీంతో పాటుగా మరో రెండు సీరియల్ లో నటిస్తున్నట్లు సమాచారం.. ఇక సోషల్ మీడియాలో ఈమె ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పనర్లేదు లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది. రీసెంట్ గా గోల్కొండ కు వెళ్లిన పిక్స్ ను షేర్ చేసుకుంది. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి..