Intinti Ramayanam Today Episode july 27th: పల్లవి ఎలాగైనా సరే ఆ అశ్విన్ గాడికి డబ్బులు ఇచ్చి ఏదో ఒకటి చేసి నగలను బయటకు తీసుకురావాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పటికి ఎప్పుడు పది లక్షలు అంటే ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు అని పల్లవి ఆలోచిస్తూ బుర్ర గోక్కుంటుంది. పల్లవి ఏదో పెద్ద సమస్యలను ఎదుర్కొంది కాబట్టి తనని బయటికి తీసుకోవాలి అనుకుంటున్నారని పల్లవి అంటుంది. ఎలాగైనా సరే వారి మొహాన డబ్బులు కొట్టి బాబుకి చేయించిన నగలను తీసుకొని రావాలి అని పల్లవి వాడికి ఫోన్ చేసి ఎందుకు నన్ను ఇలా బెదిరిస్తున్నావు నీకు కావాల్సినట్లు డబ్బులు ఇచ్చాను కదా అని అంటారు. పల్లవి కమల్ కి విడలా తెలుసు అని ఆలోచిస్తూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. పల్లవి ఇంకాస్త టెన్షన్ పెట్టేలా అశ్విన్ మాట్లాడుతూ ఉంటాడు.
ఆరాధ్యను రెడీ చేస్తున్న అవని ఎందుకు నువ్వు ఇలా తుమ్ముతున్నావు వేరే వాటర్ ఏమైనా తాగావా అని అడుగుతుంది. లేదమ్మా అని ఆరాధ్య ఎంత చెప్తున్నా సరే నిజం చెప్పు అని అవని అడుగుతుంది.. అయితే అక్కడికి వచ్చిన భానుమతి అడ్డమైన గడ్డంతో తింటే ఇలానే ఉంటుంది అని అంటుంది.. అడ్డమైన గడ్డి నేనేం తిన్నాను అని ఆరాధ్య అనగానే.. ఐస్ క్రీములు నిన్న ఎంతగా తిన్నారో తెలియదా..? ఐస్ క్రీములు తిని ఇలా జలుబు చేసింది. ఆ మాట వినగానే అవని చాలా సీరియస్ అయ్యే కమల్ ని పిలుస్తుంది. మీరిద్దరూ నిన్న కలిసి ఐస్క్రీమ్ తిన్నారా లేదా అని కమల్ కి సీరియస్ గా క్లాస్ పీకుతుంది అవని.. భానుమతి కమల్ ను ఇరికించింది అని తనతో ఆడుకుంటాడు..
నువ్విలా దుమ్ముకుంటూ క్లాసులోకి వెళ్తే మేడం వాళ్ళు ఏమైంది అని నన్ను అడుగుతారు. అసలు ఇలాంటి పనులు నువ్వు ఎందుకు చేస్తావు అని ఆరాధ్యతో పాటుగా కమల్ ఇద్దరికీ క్లాస్ పీకుతుంది అవని.. ఆ తర్వాత అందరూ కలిసి టిఫిన్ చేసినందుకు కూర్చుంటారు. ఇంట్లోని వాళ్ళందరూ టిఫిన్ చేస్తూ ఉండగా అక్షయ్ అవనితో ఎలాగైనా సరే మాట్లాడాలి అని అనుకుంటాడు.. కానీ అవని మాత్రం తను ఏం చెప్పాలనుకున్నో దాన్ని కేవలం పేపర్లు రాసి మాత్రమే ఇస్తుంది.. అక్షయ్ ఎలాగైనా సరే అవన్నీ తో మాట్లాడాలి అని అనుకుంటాడు.. కానీ అవని మాత్రం అక్షయ్ కి మాటకు మాట పేపర్ తోనే సమాధానం చెబుతూ ఉంటుంది. అందరికీ ఇష్టమైన వంటలు చేస్తుంది కానీ నాకు ఇష్టమైన వంటల్ని చేయదు అని అనుకుంటూ ఉంటాడు.
పల్లవి ఎలాగైనా సరే అశ్విని పీడ వదిలించుకోవాలి అని అనుకుంటుంది. వాడు అడిగినంత డబ్బులని తెచ్చి ఇచ్చి బాబుకి సంబంధించిన నగలను తీసుకొని రావాలి అని అనుకుంటుంది.. అయితే చక్రధర్ బయటికి వెళ్లడం చూసిన పల్లవి ఇంట్లో ఎవరూ ఉండరు నాకు కావాల్సినట్లు నేను దొంగతనం చేయొచ్చు అని అనుకుంటుంది. అయితే ప్రణతి నీ కాఫీ పెట్టమని చెప్పి డబ్బులను దొంగతనం చేస్తుంది.. మళ్లీ డబ్బులు అయితే తెలిసిపోతుంది అమ్మని నగలన్నీ తీసుకుంటే బాగుంటుంది అని అనుకొని రాజేశ్వరి నగలను దొంగతనం చేస్తుంది పల్లవి.. ఇక ప్రణతికి అనుమానం రాకుండా మెల్లగా పల్లవి అక్కడి నుంచి జారుకుంటుంది…
అవని గతంలో తను తాకట్టు పెట్టిన నగలని తీసుకోవాలి అని నగల షాప్ కి వెళ్తుంది. అక్కడ నగలను తాకట్టు పెట్టినవి తీసుకోవాలి అని అన్ని చెక్ చేసుకుంటూ ఉంటుంది.. అదే షాప్ కి పల్లవి అశ్విన్తో కలిసి వెళుతుంది.. పల్లవి అవనీను చూసి అక్కడ నుంచి మెల్లగా వెనక్కి వచ్చేస్తుంది.. కానీ అశ్విన్ మాత్రం పల్లవి టెన్షన్ పడితే నాకు చాలా సంతోషంగా ఉంది అని అనుకుంటాడు.. మీ అక్క నన్నేమీ చూడలేదు కదా మాకేమి పరిచయం లేదు కదా.. ఇద్దరం కలిసి మాట్లాడుకున్న సందర్భాలు కూడా లేవు కదా.. నేను వెళ్ళా నగలను తీసుకొని వస్తాను అని అశ్విన్ పల్లవికి టెన్షన్ పెడుతూ అక్కడికి వెళ్తాడు.. ఎలాగైనా సరే పల్లవిని అవని దగ్గర ఇరికించాలి అనుకుని అనుకుంటాడు అశ్విన్.. కానీ అవని మాత్రం అశ్విన్గమనించుకున్న వెళ్ళిపోతుంది.. పల్లవి సేఫ్ అని అనుకుంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపుటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి…
Also Read :సీరియల్ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. సీరియల్లో మరో ట్విస్ట్..!