Brahmamudi Serial : ప్రముఖ తెలుగు ఛానెల్ స్టార్ మాలో ఒకప్పుడు మంచి టాక్ ను సొంతం చేసుకున్న సీరియల్స్ లలో బ్రహ్మముడి ఒకటి. ఈ మధ్య కాలంలో కథలో అనేక ట్విస్ట్ లు ఎదురయ్యాయి. కానీ ఆడియన్స్ ను కొత్త సీరియల్స్ ఎక్కువగా ఆకట్టుకోవడంతో ఈ సీరియల్ రేటింగ్ దారుణంగా పడిపోయింది.. దాంతో ఈ మధ్య సీరియల్ ను చూసే వారి సంఖ్య కూడా బాగా తగ్గిపోయింది. ఈ సీరియల్ లవర్స్ సోషల్ మీడియా వేదికగా కథలో మార్పులు తీసుకొని రావాలని కోరుకుంటున్నారు. కానీ ఎక్కడ మార్పులు అయితే కనిపించలేదు. ఇక త్వరలోనే ఈ బ్రహ్మముడికి శుభం కార్డు పడుతుందని టాక్ వినిపిస్తుంది. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ, ఈ వార్తలు మాత్రం రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నాయి. అసలు నిజం ఏంటో ఒకసారి తెలుసుకుందాం..
తెలుగు ప్రేక్షకులను ఒకప్పుడు ఎంతగానో ఆకట్టుకున్న సీరియల్స్లలో బ్రహ్మముడి సీరియల్ ఒకటి. ఒక జంట కి బ్రహ్మ ముడి పడితే జన్మజన్మలకు ఆ జంట మళ్లీ ఏదో ఒక రూపంలో కలుసుకుంటారన్న స్టోరీతో ఈ సీరియల్ స్టోరీ ఉంటుంది. రాజ్ కావ్యల పెళ్లి ఎలా జరిగినా కానీ వాళ్లు మాత్రం ఒకరికొకరు ప్రేమ గానే ఉంటున్నారు. కావ్యాలు తన మంచితనంతో అందరిదీ ఆకట్టుకుంటూ వచ్చింది. అలా ఈ సీరియల్లో ఈ జంట హైలెట్గా నిలిచింది. ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా ముందుండి ఆ కష్టాన్ని తీరుస్తూ అందరినీ నడిపించిన ఈ జంటకు యాక్సిడెంట్ అవుతుంది.. ఆ తర్వాత సీరియల్ స్టోరీ పూర్తిగా మారిపోయింది.. అయితే ఆ స్టోరీ పెద్దగా ఆకట్టుకోకపోవడంతో జనాలు ఈ సీరియల్ శుభం కార్డు పడిపోతుంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.. గత కొన్ని రోజులుగా ఈ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.. కానీ ఎక్కడ నిజం అని ఈ సీరియల్ యూనిట్లు క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు మరోసారి ఇలాంటి వార్తలు వినిపించడంతో ఇవి కేవలం సోషల్ మీడియా పుకార్లు మాత్రమే అని అభిమానులు కొట్టి పరుస్తున్నారు. ఒకవేళ సీరియల్ స్టోరీ డల్ అవ్వడంతో శుభం కట్టు పడుతున్నదేమో చూడాలి..
సీరియల్ మొదలైనప్పుడు ఉన్న జంటలు మరో జన్మలో పుట్టి మళ్లీ జంటలుగా మారుతారు అన్న విషయం సీరియల్లో కనిపిస్తుంది.. మళ్లీ జన్మలెత్తిన తర్వాత కూడా అనుకోని పరిస్థితులలో ఆ జంటలు మళ్ళీ కలుసుకుంటాయి. అలా మళ్లీ ఒక్కటవుతారు ఇందు రాజ్.. అనుకోని పరిస్థితులలో వీళ్లిద్దరు పెళ్లి కూడా జరుగుతుంది. ఆ తర్వాత ఒకరంటే ఒకరికి ఇష్టం కూడా పెరుగుతుంది. వీరిద్దరిని విడగొట్టే ఆస్తిని లాక్కోవాలని చూస్తుంది రేఖ.. రేఖ ఎలాంటి ప్లాన్లు వేసిన సరే ఆ ఇంట్లోని అమ్మాయిలు రాజ్ హిందులకు సపోర్టుగా నిలుస్తారు.. ఆస్తులలో కాపాడుకోవడానికి ఎందుకు చేస్తున్న ప్రయత్నాలు జనాలని కాస్త ఆకట్టుకుంటున్నాయి.. ఏది ఏమైనా కూడా రాజ్ హిందువులు మళ్లీ ఒక్కటయ్యి మరో జంటకి జన్మనిస్తే బాగుంటుంది అని కొందరు అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ సీరియల్ ఎలాంటి ట్విస్ట్ లతో ముందుకు సాగుతుందో అన్నది ఇకముందు ఎపిసోడ్లలో చూడాలి..
Also Read :‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ టీఆర్పీ రేటింగ్.. జూలై నెల హైలెట్స్..