Intinti Ramayanam Today Episode May 23rd : పల్లవి అవనిని ఎంతగా అడుగుతున్న సరే నిజం చెప్పను అని అంటుంది. ఇక పల్లవి మళ్లీ ఆ ఇంటికి రావడం చూసిన పార్వతీ అలాగే భానుమతి ఇద్దరు సంతోషంగా ఉంటారు.. కానీ కమల్ మాత్రం నువ్వు ఇంట్లోకి రావడానికి నేను అసలు ఒప్పుకోను అని అంటాడు. ఇంటిని కూల్చాలని అనుకునే దీన్ని మల్ల ఎందుకు తీసుకొచ్చావు వదిన అని అవనితో కమల్ సీరియస్ గా మాట్లాడుతాడు. కానీ కమల్ అవనీ చెప్పిన వినకుండా పల్లవిని కొట్టబోతాడు. పల్లవి అడ్డుపడుతుంది. ఏంటి కనే నువ్వు చేసేది ఆడవాళ్ళ మీద చేయి చేసుకోవడం అంత మంచిది కాదు అని అవని ఎంత చెప్తున్నా సరే కమల్ మాత్రం అస్సలు వినడు..
అసలు ఎలా మారిపోయావు కన్నయ్య ఆడవాళ్ళ మీద చేయి చేసుకోవద్దని నీకు చెప్పాను కదా అయినా కూడా నువ్వు ఇలానే చేస్తావా అని కమల్ అడుగుతాడు. నువ్వు దీని గురించి ఎన్ని చెప్పినా సరే వదినా నేను మాత్రం నిన్ను క్షమించను అని కమలం అంటాడు. అలా కాదు మన డాక్టర్ ఏం చెప్పాడు. మావయ్య గారు త్వరగా కోలుకుంటున్నారు అని చెప్పాడా లేదా? అయితే ఇలాంటి టైంలో ఎవరికి వారే (అన్నట్లు ఉంటే మావయ్య గారు చాలా బాధపడి మళ్లీ ప్రమాదాన్ని కోరి తెచ్చుకునే వాడు అవుతాడు అందుకే నేను ఇలా ప్లాన్ చేశాను అని అవని అంటుంది.. నువ్వు చెప్పింది కూడా నిజమే వదిన కానీ దీన్ని మాత్రం నేను క్షమించను అని కమలంటాడు.
రాజేంద్రప్రసాద్ కోమల నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది అని అవని చెప్పగానే పల్లవి కంగారు పడిపోతుంది. గతంలో రాజేంద్రప్రసాద్ ని పల్లవి ఎంతగా బ్రతిమలాడిందో దాన్ని గుర్తు చేసుకుంటుంది. ఆయన గారిని నేను ఎంతగా బ్రతిమిలాడిన సరే నా మాట కాదన్నారు కాబట్టే ఆయన చంపడానికి ప్రయత్నించాను. ఇప్పుడు ఆయన కోమల నుంచి బయటకు వస్తే.. ఆ విషయాన్ని చెప్తే నన్ను ఈసారి ఇంటికి తీసుకెళ్లడం కాదు ఏకంగా పైకే పంపిస్తాడు అని భయపడిపోతూ ఉంటుంది. ఎలాగైనా సరే ఈ ముసలాన్ని కోమా నుంచి బయటికి రానివ్వకుండా చేయాలి అని అనుకుంటుంది.. ఒకవేళ ఈయన గనక కోమల నుంచి బయటకు వచ్చి నిజం చెప్తే నాకు ఇదే చివరి రోజు అవుతుంది అని పల్లవి కంగారు పడిపోతూ ఉంటుంది.
అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడానికి వెళ్లి పోతారు. అయితే పల్లవి మాత్రం నా భర్త చేత నన్ను అవమానించడానికి ఇక్కడికి తీసుకొని వచ్చావా.. అసలు నువ్వు మా మామకి ఏం చెప్పినా నీకు తీసుకొచ్చావు అని పల్లవి ఎంత అడుగుతున్నా సరే అవని మాత్రం నేను ఎందుకు చెప్పాలి మీ అమ్మని అడిగి తెలుసుకోవచ్చు కదా అని అంటుంది. మా మామ్ అసలు ఏం జరిగిందో చెప్పడం లేదు అని అనగానే అవని నీకు కావాలంటే మీ అమ్మని అడిగే నిజం తెలుసుకో లేదంటే నోరు మూసుకొని ఉండు అని వార్నింగ్ ఇస్తుంది. మా మామ్ ని ఎందుకలా మార్చేసావు. నాకు అర్థం కావడం లేదు అని పల్లవి అనగానే.. నీకు అంతగా నిజాలు కావాలంటే మీ అమ్మ దగ్గరికి వెళ్లి అసలు నిజాన్ని ఏంటో కనుక్కొని వాళ్లకి ఇండైరెక్టుగా ఇంట్రెస్ట్ ఉంది అవని..
అవని అన్నట్లుగానే మా మామ్ కు ఏదో చెప్పినట్లు ఉంది. అదేంటో నేను వెంటనే తెలుసుకోవాలి అని పల్లవి తన తల్లికి ఎన్ని సార్లు ఫోన్ చేసినా సరే ఆ ఫోన్ లిఫ్ట్ చేయరు. ఉదయం వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎందుకు మామ్ తీయడం లేదు అసలు ఏం జరిగింది అని ఆలోచనలో పడిపోతుంది. అటు భరత్ పల్లవి సిస్టర్ ఫోన్ చేస్తుంది అని చెప్పిన సరే రాజేశ్వరి మాత్రం దాని గురించి నువ్వు పట్టించుకోవద్దు అని అంటుంది.. మా అక్క ఏదో చెప్పి వెళ్ళింది కానీ ఏం చెప్పింది అర్థం కావడం లేదు మీరు ఇలా ఉంటే నాకు బాధగా ఉంది అని భరత్ అంటాడు.. భరత్ కి పల్లవి ఫోన్ చేసి అమ్మకు ఒకసారి ఫోన్ ఇవ్వవా అని అడుగుతుంది. రాజేశ్వర్ కి ఫోన్ ఇచ్చిన భరత్ ఇప్పుడు మాట్లాడలేను తర్వాత దీని గురించి మాట్లాడుతాను అని చెప్పడంతో పల్లవికి అనుమానం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. పల్లవికి నిజం తెలుస్తుందా రాజేంద్రప్రసాద్ కుమార్ అని బయటికి వచ్చి నిజం చెప్తాడా అన్నది తెలియాలంటే మరి కొద్ది రోజులు మాత్రమే వెయిట్ చేయాలి… కానీ పల్లవి ఎంతగా అడుగుతున్న కానీ రాజేశ్వరి మాత్రం నిజం చెప్పకపోవడంతో పల్లవికి ఏదో జరిగింది అని అనుమానం అయితే మొదలవుతుంది. ఎలాగైనా సరే మామ్ కు అవని ఏం చెప్పిందో తెలుసుకోవాలి అని అనుకుంటుంది పల్లవి అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..