Shobha Shetty : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు శోభా శెట్టి.. ఈమె తెలుగులో ప్రసారమైన సక్సెస్ఫుల్ సీరియల్ కార్తీకదీపం తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ సీరియల్ లో విలన్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది.. తన నటనతో అందరిని ఆకట్టుకున్నా ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య సీరియల్స్ కి గుడ్ బై చెప్పేసిందా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.. రియాల్టీ షో బిగ్ బాస్ లో ఈమె పాల్గొని తనదైన స్టైల్ లో కామెంట్లను అందుకుంది.. అది కాదు ఈ షో తర్వాత ఆమెకు నెగిటివిటీ బాగా పెరిగిపోవడంతో పెద్దగా సీరియల్ అవకాశాలు కూడా ఆమె వరకు రాలేదని వార్తలు వినిపిస్తున్నాయి.. దాంతో కేవలం సోషల్ మీడియాలో మాత్రమే వీడియోలను షేర్ చేస్తూ వస్తుంది. అయితే తాజాగా ఈమె గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతుంది. అది శోభ శెట్టి షేర్ చేసిన ఎమోషనల్ స్టోరీ అని తెలుస్తుంది. ఇంతకీ ఆమె జీవితంలో కన్నీళ్లు తెప్పించిన ఆ స్టోరీ ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం..
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైన మోనిత అలియాస్ శోభ శెట్టి గురించి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఆమె రియల్ లైఫ్ లోని అందుకునే సంఘటనలు గురించి ఆమె అభిమానులు ఎంతగానో విచారణ వ్యక్తం చేస్తున్నారు. శోభ లాంటి అమ్మాయికి ఇన్ని కష్టాలను దేవుడు ఎందుకు పెడుతున్నాడు అంటూ సోషల్ మీడియాలో ఒక పెద్ద చర్చ నడుస్తుంది.. ఇంతకు ఆ చర్చ ఏంటంటే.. ఇటీవల శోభ శెట్టి తల్లి చనిపోయిన విషయం తెలిసిందే.. తన తల్లి గురించి ఎమోషనల్ స్టోరీని ఆమె ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూనే ఉంటుంది. శోభ శెట్టి తల్లి గత ఐదేళ్ల నుంచి లివర్ క్యాన్సర్ తో బాధపడుతుంది. ఇటీవలే ఐదు నెలల క్రితం ఆమె కన్నుమూశారు.. శోభా శెట్టి నీ ఎంతో గారభంగా పెంచుకున్న తల్లి దూరం అవడంతో తను కూడా చాలా బాధపడుతుంది.. ప్రస్తుతం శోభ శెట్టి తల్లి చనిపోయారు అన్నా న్యూస్ ఒకటి ఇంస్టాగ్రామ్ లో బాగా వైరల్ అవుతుంది. ఏది ఏమైనా కూడా ఆమె తల్లిని బిడ్డగా చాలా బాధపడుతుంది అని తెలుస్తుంది.
సీరియల్ హీరోయిన్ శోభ శెట్టి కొన్నేళ్లుగా నటుడు యశ్వంత్ తో ప్రేమాయణం నడిపించింది. అయితే తమ రిలేషన్ గురించి ఎక్కడ బయటపడకుండా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తూ వచ్చింది. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు తన రిలేషన్స్ గురించి బయట పెట్టింది.. హౌస్ నుంచి బయటికి రాగానే.. కొత్త ఇల్లు కొనడం గృహప్రవేశం చేయడం, ఎంగేజ్మెంట్ కూడా గ్రాండ్ గా చేసుకుంది.. కుటుంబ సభ్యుల మధ్య ఇటీవలే గ్రాండ్గా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. అయితే పెళ్లయిన కొద్ది రోజులకి తల్లిని కోల్పోవడంతో ఆమె బాధ వర్ణనతీతం. కేవలం తన దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిన కొద్ది రోజుల్లోనే ఇలా జరగడంతో ఆమె అభిమానులు కూడా చాలా ఫీల్ అవుతున్నారు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే ప్రస్తుతం సోషల్ మీడియాలో హైపర్ ఆక్టివ్ గా ఉంటున్నాయి ఈ ముద్దుగుమ్మ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ బిజీగా ఉంది. అంతేకాదు కన్నడ సినిమాలలో కూడా నటిస్తుందని సమాచారం..
Also Read : ఇవాళ థియేటర్లలోకి రాబోతున్న సినిమాలు.. ఆ ఒక్కటి డోంట్ మిస్..