Telugu TV Serials : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న వాటిలో ఎక్కువగా సీరియల్స్ ఉన్నాయి.. ఒక్కో సీరియల్ ఒక్కో స్టోరీ తో రావడంతో ఆడియన్స్ ఎక్కువగా సీరియల్స్ చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. ఈ మధ్య టీవీ సీరియల్స్ రేటింగ్ పెంచుకొనే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రతి సీరియల్ కూడా స్టోరీ తో పాటుగా కొన్ని గ్రాఫిక్స్ తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి.. స్టార్ మా చానల్లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా తెలుగు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతున్నాయి. దాంతో ఆడియోస్ ఎక్కువగా ఈ సీరియల్స్ ని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇందులో ప్రసారం అవుతున్న ప్రతి సీరియల్ కూడా జనాలను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ మధ్య బిగ్ బాస్ వల్ల సీరియల్స్ రేటింగ్ తగ్గిపోయిందని ఓ వార్త అయితే సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. ఇప్పుడు కొన్ని సీరియల్స్ స్టోరీలు బోరింగ్ గా ఉండటంతో వాటికి త్వరలోనే శుభం కార్డు వేసుకోబోతున్నాయని ఓ వార్త చక్కర్లు కొడుతుంది.. ఆ రెండు సీరియల్స్ ఏవి? స్టోరీ వీక్ ఎక్కడ అయ్యింది? ప్రస్తుతం వాటి టీఆర్పి రేటింగ్ ఎంత ఉన్నది ఒకసారి చూసేద్దాం..
ప్రముఖ తెలుగు ఛానెల్ స్టార్ మా ప్రేక్షకులను అలరించడానికి ముందుంటుంది. ఈ ఛానెల్ లో ప్రసారం అవుతున్న ప్రతి సీరియల్ కూడా జనాలను అలరిస్తున్నాయి. అందులో కొన్ని సీరియల్స్ కు ప్రత్యేకత ఉంటుంది. అలాంటి వాటిలో ఇల్లు ఇల్లాలు పిల్లలు ఒకటి.. ఈ సీరియల్ టిఆర్పి రేటింగ్ విషయంలో ముందంజలో ఉంది.. కార్తీకదీపం 2 మొదటి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఉంది. ఒక తండ్రి తన పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. ఎవరు ఎంతగా అవమానించిన సరే అతను మాత్రం ఎక్కడ తగ్గకుండా కుటుంబం కోసం నిలబడతాడు.. నాటకాలు ఆడి ఆ ఇంటికి కోడలుగా వచ్చిన పెద్ద కోడలు అధికారం మొత్తం తన చేతిలోకి రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాది. ఇప్పుడు ఆమె చదువు గురించి బయటపడకుండా ఉండేందుకు తన తోడికోడళ్ల కాపురాల్లో చిచ్చు పెడుతుంది.. అయితే మొన్నటివరకు గుట్టుగా ఉన్న కొన్ని పర్సనల్ విషయాలు బయటపడ్డాయి. కానీ పెద్దగా అనుకున్న ట్విస్ట్ లు ఇక్కడ లేకపోవడంతో సీరియల్ ను ఆడియన్స్ బోరింగ్ గా ఫీల్ అవుతున్నారని వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. దాంతో కేవలం కొన్ని ఎపిసోడ్ లతో సీరియల్ కు శుభం కార్డు వేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ విషయం పై క్లారిటీ రానుంది.. ప్రస్తుతం ఈ సీరియల్ టీఆర్పీ రేటింగ్ 12 గా ఉంది..
తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియస్లలో స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న ఇంటింటి రామాయణం ఒకటి. ఇప్పటివరకు ఏ సీరియల్ రివెంజ్ స్టోరీ తో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.. పల్లవి చక్రధర్ పాత్రలు జనాల నుంచి విమర్శలు కూడా అందుకున్నాయి. తను ప్రేమించిన వ్యక్తి దక్కలేదు నీ పల్లవి తను కోడలు పెట్టిన ఇంటిని ముక్కలు చేయాలని అనుకుంటుంది. కానీ ఆ ఇంటి పెద్ద కోడలు మాత్రం తన కుటుంబాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ వస్తుంది. ప్రస్తుతం ఈ సీరియల్ లో ఆస్తి కోసం ఇంటర్ సభ్యులు కూడా పడుతూ ఉంటారు. అది కాస్త బోరింగ్ గా అనిపిస్తుంది. జనాలు ఈ సీరియల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు.. గత రెండు వారాలుగా ఆస్తి గురించి గొడవలు జరగడంతో సీరియల్ టిఆర్పి రేటింగ్ దారుణంగా పడిపోయింది. ఆస్తి కోసం ఇంట్లో జరిగే కొన్ని డ్రామాలు జనాలని ఆకట్టుకోలేదు. దాంతో ఈ సీరియల్కు త్వరలోనే శుభం కార్డు పడిపోతుందని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. ప్రస్తుతం ఈ సీరియల్ టిఆర్పి రేటింగ్ 11.23 ఉన్నట్లు తెలుస్తుంది.
Also Read : ఇమ్మానుయేల్ అవుట్..15 వారాలకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడంటే?
మరి ఈ రెండు సీరియల్స్ కూడా టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్నాయి.. కానీ ఈ వారం మాత్రం ఈ సీరియల్ రేటింగ్ పడిపోయినట్లు తెలుస్తుంది. మరి కొత్త సీరియల్ వల్ల ఈ రేటింగ్ తగ్గిపోయిందా?. ఈవారం ఈ సీరియల్స్ టిఆర్పి రేటింగ్ పెంచుకోవాలంటే ఏదైనా ట్విస్టులు జరుగుతాయేమో చూడాలి..ప్రస్తుతం బిగ్ బాస్ పూర్తి అయ్యింది.. దాంతో ఇప్పుడు కొత్త సీరియల్స్ కూడా ప్రారంభం కాబోతున్నాయి..