Telugu TV Serials : తెలుగు బుల్లితెర ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్న వాటిలో సీరియల్స్ ఎప్పుడు టాప్ లోనే ఉంటాయి.. ఈమధ్య టీవీ చానల్స్ కొత్త కొత్త సీరియల్స్ ని ప్రసారం చేస్తూ ఆడియన్స్ ని ఆలోచించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.. నువ్వా నేను అంటూ ఎన్నో సీరియల్స్ ఇప్పుడు జనాలను ఎంటర్టైన్ చేస్తున్నాయి.. ఒకప్పుడు సీరియస్లలో కేవలం సెంటిమెంట్ డైలాగులు మాత్రమే ఉండేవి. కానీ ఈ మధ్య వస్తున్న సీరియల్ అన్నిట్లో కూడా కామెడీ, రివెంజ్ డ్రామా తో స్టోరీలు ఉంటున్నాయి. దాంతో సినిమాలకన్న ఎక్కువగా సీరియల్స్ ను చూసేందుకు జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రతి తెలుగు ఛానల్ లో ప్రతిరోజు ఏదో ఒక సీరియల్ ప్రసారమవుతూనే ఉంది. అయితే ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్లలో టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్స్ ఏవో ఒకసారి మనం చూసేద్దాం…
తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానెల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో కార్తీకదీపం 2 ఒకటి.. రెండో స్థానంలో ఇల్లు ఇల్లాలు పిల్లలు ఉంది. ప్రస్తుతం స్టార్ మా లో వస్తున్న సీరియల్స్లలో ఈ రెండు రేటింగ్ లో టాప్ లో కొనసాగుతున్నాయి. గుండె నిండా గుడి గంటలు, ఇంటింటి రామాయణం సీరియల్స్ అయితే మూడు నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇప్పుడు వరకు టాప్ టిఆర్పి రేటింగ్ కార్తీకదీపం 2 ఉంది. బాగా రేటింగ్ అందుకొని దూసుకుపోతుంది.. ఈ సీరియల్స్ అన్ని కూడా డిఫరెంట్ స్టోరీతో వస్తున్నాయి. కొత్త సీరియల్స్ ను స్టార్ మా ప్రసారం చేస్తుంది. కొత్త సీరియల్స్ రావడంతో పాత సీరియల్స్ కు మంచి రేటింగ్ రావడం విశేషం.. చిన్ని 9. 63 రేటింగ్ ను నమోదు చేసుకుంది. నిండు నూరేళ్ల మనసు 8 ఉండగా, మిగిలిన సీరియల్స్ తర్వాత స్థానంలో ఉన్నాయి.. కొత్త సీరియల్స్ పొదరిల్లు, నువ్వు లేక నేను లేను సీరియల్స్ 10 రేటింగ్ తో దూసుకుపోతుంది..
ఈ మధ్య కొత్త సీరియల్స్ రావడంతో పాత సీరియల్స్ కు శుభం కార్డు పడబోతుందని ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ముఖ్యంగా విడిపించే సీరియల్ గుండెనిండా గుడిగంటలు.. ఆ తర్వాత ఇల్లు ఇల్లాలు పిల్లలు. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ దాదాపు అయిపోయినట్లు ప్రస్తుతం నడుస్తున్న స్టోరీని చూస్తే అర్థమవుతుంది.. రోహిణి గురించి అసలు నిజం బయటపడితే ఈ సీరియల్ అయిపోతుందని సోషల్ మీడియాలో ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి. అదే కనుక నిజమైతే ఈ సీరియల్ ప్లేసులోకి మరో కొత్త సీరియల్ రాబోతుందని సమాచారం. అలాగే ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ దాదాపు అయిపోయినట్లే కనిపిస్తుంది. ఇందులో రామరాజు కుటుంబం నుంచి తన కూతురు భద్ర కుటుంబంలోకి కోడలుగా అడుగుపెడుతుంది.. చిన్న కొడుకు సాగర్ తండ్రికి తెలియకుండా గవర్నమెంట్ ఉద్యోగాన్ని సొంతం చేసుకుంటాడు. అటు ఆఖరి కోడలు కూడా పోలీసు ఉద్యోగానికి వెళ్లాలని అనుకుంటుంది. మొత్తానికి రామరాజు పరిస్థితి ఇప్పుడిప్పుడే కుదుటపడుతుంది. సాగర్ 20 లక్షలు తీసుకొని గవర్నమెంట్ ఉద్యోగం కొన్నాడు అన్న విషయాన్ని ఇంట్లో చెప్తాడా? చెప్తే మాత్రం స్టోరీ ఎండుకొచ్చినట్లే అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. ఏది ఏమైనా కూడా ఈ వారంలో టెలికాస్ట్ అవుతున్న ఎపిసోడ్ లో చూస్తే ఒక క్లారిటీ అయితే వస్తుంది…