Podarillu kesava : టీవీ ఆడియన్స్ ని ఆకట్టుకోవడంలో సీరియల్స్ ఎప్పుడు ఒక్క అడుగు ముందే ఉంటాయి. ఒకప్పుడు కేవలం సీరియల్స్ సాగదీసే ఏడుపుగొట్టు స్టోరీలతో ఉండేవి.. కానీ ఈ మధ్య వస్తున్న స్టోరీస్ మాత్రం సినిమాలను మించి గ్రాఫిక్స్ తో వస్తున్నాయి.. ఒకప్పుడు సినిమాలకి యూస్ చేస్తే గ్రాఫిక్స్ ఇప్పుడు సీరియల్స్లలో కూడా చూడటంతో వీటికి డిమాండ్ ఎక్కువ అవుతుంది. సీరియల్స్ అంటే ఆడవాళ్ళకి మాత్రమే అన్న మగాళ్ల సైతం సీరియల్స్ మిస్ అవ్వకుండా చూస్తున్నారు.. ముఖ్యంగా స్టార్ మా లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా టాప్ రేటింగ్తో దూసుకుపోతుంది. ఈమధ్య ఈ ఛానల్ లో కూడా కొన్ని సీరియల్స్ జనాలని బాగా కట్టిపడేస్తున్నాయి. అలాంటి వాటిలో కొత్త సీరియల్ పొదిరిల్లు ఒకటి.. ఈ సీరియల్ లో కేశవ పాత్రలో నటిస్తున్న వ్యక్తి గురించి తెలుసుకునేందుకు అభిమానులు గూగుల్లో తెగ వెతికేస్తున్నారు. ఇంతకీ అతని బ్యాగ్రౌండ్ ఏంటి? అతను ఇంతకు ముందు చేసిన సీరియల్స్ ఏవి? ఒక రోజుకి అతను తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంతనో ఒకసారి మనం తెలుసుకుందాం..
బుల్లితెర ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్న లేటెస్ట్ సీరియల్ పొదరిల్లు. ఒక కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు ఉంటారు.. అందులో మూడవ వ్యక్తి కేశవ.. ఇతని అసలు పేరు గౌరవ వర్మ. ఈయన తెలుగు నటుడే. తెలుగులో ఈ నటుడు గతంలో ఎన్నో సీరియస్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గౌరవ్ నటించిన సీరియల్స్ లలో శివంగి, కాంతారావు అంటే సీరియల్స్ అతనికి మంచి క్రేజ్ ని తీసుకొచ్చాయి.. నటుడిగా ప్రేక్షకుల మనసుల్లో జరగని ముద్ర వేసుకున్నాడు. ప్రస్తుతం మొదటిలో సీరియల్ ద్వారా మరోసారి ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఈ సీరియల్లో అతని ఆటిట్యూడ్ కి జనాలు ఫీదా అవుతున్నారు..
పొదరిల్లు సీరియల్ ని కార్తీకదీపం ఫెమ్ హీరో నిరూపం పరిటాల నిర్మించారు. డిఫరెంట్ స్టోరీ తో వచ్చిన ఈ సీరియల్ డిసెంబర్ 22న 2025న ప్రారంభమైంది. ఒకవైపు బిగ్ బాస్ ఉన్నా కూడా జనాలు ఈ సీరియల్ ని చూసేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించారు.. అందుకే సీరియల్ ప్రసారమైన కొద్ది రోజులకే మంచి టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకుంది.. ఇందులో కేశవ పాత్రలో గౌరవ వర్మ నటించారు.. ఈ సీరియల్లో అతని నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈయన రెమ్యూనరేషన్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఒకరోజుకి దాదాపు 30 వేలకు పైగా తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.. ఈ లెక్కన చూస్తే అతనికి మంచి డిమాండ్ ఉందని అర్థమవుతుంది..
Also Read : కన్నా మాటతో మహా ఎమోషనల్.. కేశవ్, శైలు మధ్య ఫైట్.. మహా కోసం కన్నీళ్లు పెట్టుకున్న లలిత..
బృందావనం అనే ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో ఎంత పాతగా ఉంటుందో అన్ని సమస్యలు కూడా ఉంటాయి..ఆ ఇంట్లో ఆడదిక్కు ఉండదని ఆ కుటుంబానికి పెద్ద అయినా నారాయణ చెల్లెలు శాపం పెడుతుంది. ఆ శాపం నిజమైందో ఏమో కానీ ఆ ఇంట్లో ఒకరికి కూడా పెళ్లి కాదు. అతి కష్టం మీద రెండవ తమ్ముడైన చక్రికి పెళ్లి జరుగుతుంది.. హీరోయిన్ మహాలక్ష్మి ఆ ఇంటికి కోడలుగా వస్తుంది. ఆ తర్వాత ఎలా ఆ నలుగురు మగాళ్ల మధ్య ఆమె ఉంటుంది అన్నది సీరియల్ స్టోరీ.. ప్రస్తుతం కేశవ లైఫ్ లోకి ఒక అమ్మాయి రాబోతుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో అన్నది సీరియల్లో ముందు ముందు ఎపిసోడ్లలో చూడాలి…