E-Paper
Advertisement

Anakapalle: ఎంత పని చేశావమ్మా!6 నెలల బిడ్డను చంపి.. తల్లి ఏం చేసిందంటే

Anakapalle: ఎంత పని చేశావమ్మా!6 నెలల బిడ్డను చంపి.. తల్లి ఏం చేసిందంటే
Advertisement

Anakapalle: అదనపు కట్నం వేధింపులు తాళలేక 6 నెలల బిడ్డను చంపి ఆత్మహత్య చేసుకుంది ఓ తల్లి. అనకాపల్లి జిల్లా చోడవరంలోని కనకమహాలక్ష్మీ నగర్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. పార్వతిపురం మన్యం జిల్లా గుమ్మిడ గ్రామానికి చెందిన వీణ, ఉమామహేశ్వరరావు.. 2024లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కట్నం కింద వీణ తల్లిదండ్రులు రూ. 20 లక్షలు ఇచ్చారు. ఉమామహేశ్వరరావు కేపీ అగ్రహారంలో ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తూ చోడవరంలో ఉంటున్నాడు. ఏడాది వరకు బాగానే ఉన్నారు. ఏడాది దాటిన తర్వాత అదనపు కట్నం తీసుకురావాలంటూ వీణను వేధించాడు. నిన్న ఉదయం వీణతో గొడవపడి , స్కూల్‌కి వెళ్లిపోయాడు. సాయంత్రం ఇంటికి వచ్చి చూసే సరికి వీణ ఉరేసుకొని చనిపోయి కనిపించింది. సమాచారం తెలుసుకున్న వీణ కుటుంబసభ్యులు భర్త వేధింపుల వల్లే చనిపోయిందని ఆరోపిస్తూ.. ఉమామహేశ్వరరావును కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

Related News

కొండాపై వేటుతో.. అసమ్మతికి చెక్ పడినట్లేనా?

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ట్యాక్సులు కట్టరా? వారి నెల జీతం ఎంత?

పోలవరం నీళ్లు ఎవరికి? డేటా సెంటర్‌కా.. సాగు అవసరాలకా?

మంత్రి పదవి పాయే.. కొండా నెక్ట్స్ ఎటు?

హిట్ అండ్ రన్.. బడాబాబులకు చట్టం వేరేనా?

ఆక్వా రైతులకు మేత షాక్

కూలుతున్న మంచు కొండలు.. డేంజర్‌‌లో నేపాల్

కర్నూలులో కదులుతున్న డీఎస్సీ డొంక

Big Stories

Advertisement
×