Anantapuram: అనంతపురం సాయినగర్లోని భారతీయ హాస్పిటల్లో మిస్టరీ ఘటన సంభవించింది. ఆసుపత్రి సిబ్బంది బయట ఉన్న జనరేటర్ నుండి దుర్వాసన రావడంతో జనరేటర్ను తెరిచి చూశారు. అందులో ఓ శవం ఉబ్బిపోయి, గుర్తుపట్టని స్థితిలో ఉండటంతో సిబ్బంది ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. జనరేటర్లో డెడ్ బాడీ పక్కనే ఇడ్లీ చెట్నీ పార్సెల్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. చనిపోయిన వ్యక్తి మతిస్థితిమం లేని వ్యక్తి గా పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి హాస్పిటల్ లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.