Anantapur: అనంతపురం రూరల్ మండలం ఆకుతోటపల్లిలో విషాదం చోటుచేసుకుంది. అదనపు కట్నం వేధింపులు తట్టుకోలేక యమున అనే వివిహిత పరుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. రాప్తాడు నియోజకవర్గానికి చెందిన యమునను, చిన్నకుంటకు చెందిన అగ్నిమాపక కానిస్టేబుల్కు 2014 లో పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లు గడిచాక భర్త ,అత్తమామలు ఎకరం పొలం కట్నం తీసుకురావాలని వేధించడం మెుదలుపెట్టారు. దీంతో యమున పోలీసులకు ఫిర్యాదు చేసినా, కౌన్సెలింగ్ తర్వాత వేధింపులు మళ్లీ మెుదలయ్యాయి. వేధింపులు తట్టుకోలేక యమున పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించింది. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. యమున పిరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కుటుంబీకులు బెంగళూరుకు తరలించారు. యమున కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.