Bapatla: బాపట్ల జిల్లాలో కాలువలో పడి ఓ కారు గల్లంతు అయ్యింది. సంతమాగులూరు మండలం మక్కెనవారి క్రాస్ రోడ్డు వద్ద అద్దంకి బ్రాంచ్ కెనాల్లోకి కారు దూసుకెళ్లింది. ఓ కారు వినుకొండ నుంచి ఒంగోలు వెళ్తుండగా బైక్ అడ్డుగా వచ్చింది. కారు డ్రైవర్ దాన్ని తప్పించే క్రమంలో కారు కాలువలోకి దూసుకెళ్లింది. కారులోకి వ్యక్తిని అటుగా వెళుతున్న అయ్యప్ప స్వాములు, రైతుల కాపాడారు. అయితే కారు మాత్రం కాలువలోని నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. స్థానికుల ఫిర్యాదుతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కారు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే కారు ఆ ప్రవాహంలో కొంత దూరం కొట్టుకుపోయిన తర్వాత ఒక సైడ్కి రావడంతోటి ఆగిపోయింది. ఇది గమనించిన పోలీసులు కారును బయటకు తీశారు.