Delhi Bomb Blast: ఢిల్లీ బాంబు పేలుడు కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఐఈడీ రవాణా చేస్తుండా పేలి ఉండొచ్చని దర్యాప్తు బృందాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఐఈడీగా మార్చకముందే పేలి ఉండొచ్చని తెలుస్తుంది. దేశంలో భారీ విధ్వంసం సృష్టించేందుకు జైష్ ఎ మహమ్మద్ మాడ్యూల్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. నిన్న ఫరీదాబాద్లో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ బ్లాస్ట్కు నిన్న అరెస్ట్ అయిన డాక్టర్లకు సంబంధాలు ఉన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఎర్రకోట పేలుడు ఘటనా స్థలం నుంచి 42 వస్తువులను సేకరించారు ఫొరెన్సిక్ అధికారులు. ఇవాళ ల్యాబ్లో పరీక్షలు జరుపనున్నారు. ఏ పేలుడు పదార్థాలు వాడారనేది నిర్ణయించేందుకు సేకరించిన 42 శాంపిల్స్ను ఫొరెన్సిక్ బృందం టెస్ట్ చేయనుంది.