Goshamahal: హైదరాబాద్ గోషామహల్లో ఓ భవనం కుంగింది. చాక్నవాడిలోని 5 అంతస్థుల బిల్డింగ్ భూమిలోకి కుంగిపోయింది. పక్కన నిర్మిస్తున్న కొత్త భవనం పిల్లర్స్ కోసం తవ్వడంతో ఈ బిల్డింగ్కు పెద్ద క్రాక్ కూడా వచ్చింది. సమాచారం అందుకున్న గోషామహల్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. సమాచారం అందించినప్పటికీ.. 6 గంటలైన జీహెచ్ఎంసీ అధికారులు స్పందించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో చుట్టుపక్కల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. భవనంలో ఉన్నవారిని ఖాళీ చేయించాలని కోరుతున్నారు.