Bheema Rayudu: జోగులాంబ గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలం నందిన్నె గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో నందిన్నె గ్రామ మాజీ సర్పంచ్ భీమా రాయుడు మృతి చెందాడు. గద్వాల నుంచి నందిన్నెకు వస్తుండగా జాంపల్లి వద్ద వెనుక నుంచి వచ్చిన బొలెరో వాహనం బైక్ను డీ కొట్టింది. సుమారు 250 మీటర్లు ఈడ్చుకెళ్లడంతో భీమా రాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం పై భీమా రాయుడు కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తూ, సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ ముందు ఉండడంతో కక్ష పూరిత హత్య అయ్యి ఉండొచ్చని ఆరోపిస్తున్నారు. ఘటన అనంతరం బొలెరో డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. భీమా రాయుడు మృతితో గ్రామంలో ఉద్రిక్తత పెరగడంతో భద్రతా ఏర్పాట్లు చేశారు.