Akkineni Nagarjuna: మంత్రి కొండా సురేఖ-అక్కినేని ఫ్యామిలీ వివాదానికి ఎండ్ కార్డు పడింది. మంత్రి కొండా సురేఖ-హీరో నాగార్జున మధ్య వివాదం ముగిసింది. నాంపల్లి కోర్టులోని డిఫమేషన్ కేసును నాగార్జున విత్ డ్రా చేసుకున్నారు. నిన్న మంత్రి కొండా సురేఖ చెప్పిన బహిరంగ క్షమాపణలతో.. నేడు హీరో నాగార్జున తన పిటిషన్ ఉపసంహరించుకున్నారు.