Dalit Controversy: దళితులు నడిచారంటూ ఓ ప్రదేశాన్ని సంప్రోక్షణ చేశారన్న ఆరోపణలు కాంగ్రెస్ నుంచి వస్తున్నాయి. పసుపు నీళ్లు చల్లడం ఏంటి..? దళితులంటే అంత చిన్నచూపా అంటూ మంత్రులు మండిపడుతున్నారు. శుద్ధి పేరుతో బీఆర్ఎస్ నేతలు చేసిన పనికి ఏం సమాధానం చెబుతారని, స్పీకర్ విషయంలో ఘటనపై కూడా బీఆర్ఎస్ నేతలకు పశ్చాత్తాపం లేదన్నారు. మరోవైపు BRS మాత్రం కథను మరోలా చెబుతోంది. డప్పు కొట్టేందుకు దళితులు అక్కడికి వెళ్తే.. నర్సారెడ్డి ఎందుకెళ్లారని ప్రశ్నిస్తోంది. ఎవరో ఏదో చేస్తే పార్టీకి ఎలా ఆపాదిస్తారని క్వశ్చన్ చేస్తున్నారు. ఇటీవల ఖర్గే పాల్గొన్న కార్యక్రమం తర్వాత సభాస్థలిని బీజేపీ నేతలు శుద్ధి చేసిన ఘటన కూడా దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. దళితులపై ఇదేనా చిత్తశుద్ధి రాజకీయం అన్న ప్రశ్నలు వస్తున్నాయ్.