Mahbubnagar: తమ్ముడి ప్రేమకు అన్న బలైపోయాడు. మహబూబ్నగర్ జిల్లాలో 3 రోజుల క్రితం కిడ్నాపైన కేసును ఛేదించిన పోలీసులు ఒక మృతదేహాన్ని గుర్తించారు. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం ఎల్లంపల్లికి చెందిన చంద్రశేఖర్ను మూడు రోజుల క్రితం కిడ్నాప్ చేసి హత్య చేశారు. ప్రేమ వివాహమే హత్యకు ప్రత్యేక ప్రధాన కారణంగా గుర్తించారు.ఎల్లంపల్లికి చెందిన భవానిని ప్రేమించి అమ్మాయితో పరారయ్యాడు చంద్రశేఖర్. ఆగ్రహంతో చంద్రశేఖర్ అన్న రాజశేఖర్ను అమ్మాయి తండ్రి కిడ్నాప్ చేశారు. తన భర్త కనిపించడం లేదని ఆ వ్యక్తి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. సరిగ్గా 3 రోజుల తర్వాత మహబూబ్నగర్ జిల్లా నవాపేటలో రాజశేఖర్ మృతదేహం లభ్యమైంది. ఆనవాళ్లు దొరకకుండా పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశారు.