Nagarjuna: నాంపల్లి కోర్టులో ఇవాళ హీరో నాగార్జున మంత్రి కొండా సురేఖపై దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్పై విచారణ జరగనుంది. బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్పై విమర్శల సందర్భంగా కొండా సురేఖ నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తమ కుటుంబ పరువుకు భంగం కలిగిందని నాగార్జున కోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే నాగార్జున, అమల, నాగచైతన్య సహా ఇతర సాక్షులు ఇప్పటికే కోర్టుకు హాజరై వాంగ్మూలాన్ని ఇచ్చారు. అయితే విచారణకు ముందు రోజు కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటూ క్షమాపణలు తెలిపారు. నాగార్జున కుటుంబాన్ని బాధపెట్టే ఉద్దేశ్యం లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ్టి విచారణలో ఏం జరగనుందనేది ఆసక్తిగా మారింది.