RTC Bus Accident: వరుస బస్ ప్రమాదాలతో ప్రజలు భయంతో బెంబెలెత్తిపోతున్నారు. జనగామ జిల్లా రఘునాథ్ పల్లి మండలం నిడిగొండ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎర్మకొండ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఓ ఆర్టీసీ బస్సు పక్కనే ఆగి ఉన్నటువంటి ఇసుక లారీని వెనుక నుండి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆరుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతులను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలతో రక్తపుమడుగులో ఉన్న బాధితులను సమీపంలోని హాస్సిటల్ కి తరలించారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.