Kondagattu: ప్రభుత్వాలు మారినంతా ఈజీగా ప్రాజెక్ట్లు పూర్తికావు.. ఒకరి హయాంలో పునాదులు పడితే.. మరొకరి హయాంలో రిబ్బన్ కట్ జరగొచ్చు. కానీ ఇక్కడే క్రెడిట్ వార్ ఎంటరై.. పొలిటికల్ హీట్ పెంచుతుంది. వెలిగొండ ప్రాజెక్ట్ ను కొబ్బరికాయ కొట్టి మేమే ప్రారంభించామని వైసీపీ అంటుంటే.. పనులు పూర్తిచేసి గుమ్మడికాయ కొట్టేది తామే అంటూ టీడీపీ అంటోంది.
ఈ ప్రాజెక్టును జగన్ ప్రభుత్వం వేగంగా ముందుకు తీసుకెళ్లిందని.. 2024 ఎన్నికలకు ముందు జాతికి అంకితం చేశామని వైసీపీ చెబుతోంది. టీడీపీ వాదన మాత్రం మరోలా ఉంది. 30 ఏళ్లుగా సాగుతున్న ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చామని టీడీపీ నేతల చెబుతున్నారు. పొలిటికల్ క్రెడిట్ పక్కన పెడితే, ఫ్లోరైడ్ రహిత నీటి కోసం దశాబ్దాల నిరీక్షణకు మోక్షం లభించబోతోంది. తడారిన బీళ్లకు.. గొంతెండిన ఊళ్లకు.. కృష్ణమ్మ నీళ్లు వస్తున్నాయ్.