Kondagattu: చేయాల్సిన పనులు ఉన్నాయి. వాటికి నిధులున్నాయి. శంకుస్థాపనలు కూడా జరిగిపోయాయి. కానీ ఎక్కడో జాప్యం జరుగుతోంది. కొండగట్టు ఆలయ అభివృద్ధి పనులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేసి ఏడు నెలలు అవుతుంది. ఐనా టెండర్లు ఎందుకు పిలవడం లేదని తెలంగాణ జనసేన ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. టీటీడీ నుంచి 35 కోట్లు రూపాయల నిధులు వచ్చినా.. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మౌనంగా ఉన్నారంటూ జనసేన సోషల్ మీడియా వేదికగా నిలదీసింది. జనసేన ప్రశ్నలపై కొండగట్టు ఆలయ ఈవో స్పందించారు.
టెండర్ ప్రక్రియ మొత్తం టీటీడీ ఆధ్వర్యంలోనే జరగాలని క్లారిటీ ఇచ్చారు. అంటే.. ఒకవైపు జనసేన ఆరోపణలు.. మరోవైపు అధికారుల వివరణ.. మధ్యలో మంత్రి పొన్నం పేరు చుట్టూ రాజకీయ చర్చ.. ఇక్కడే గత రాజకీయ విభేదాలు కూడా తెరపైకి వస్తున్నాయి. గతంలో పొన్నం ప్రభాకర్, పవన్ కల్యాణ్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇప్పుడు కొండగట్టు అభివృద్ధి అంశంలో జనసేన నేరుగా పొన్నంను టార్గెట్ చేయడంతో.. పాత రాజకీయ వేడి మళ్లీ రాజుకుంటుందా అన్న చర్చ మొదలైంది. ఈ రాజకీయ వివాదాలను పక్కన పెడితేఏ.. టెండర్ల ప్రక్రియ ఎందుకు లైట్ అవుతున్నట్టు..?