Ramanthapur: రామంతపూర్లోని కేసీఆర్ నగర్లో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు భారతీ అనే మహిళ నీటి సంపులో పడి మృతి చెందింది. ఉదయం 5.30 గంటల సమయంలో ట్యాప్ ఆఫ్ చేస్తున్న క్రమంలో నీటి సంపులో పడినట్లు సమాచారం. మృతురాలు భారతి శ్రీకాకుళం వాసిగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్నిబయటకు తీసి గాంధీ హాస్పిటల్ కు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.