హైదరాబాద్లోని రవీంద్రభారతి ప్రాంగణంలో దివంగత గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (ఎస్పీ బాలు) కాంస్య విగ్రహాన్ని సోమవారం ఘనంగా ఆవిష్కరించారు.
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ మంత్రి శ్రీధర్బాబు హాజరయ్యారు. గాయని ఎస్పీ శైలజ, నటుడు శుభలేఖ సుధాకర్ సహా పలువురు సినీ, సంగీత ప్రముఖులు పాల్గొన్నారు. బాలుపై తమ అభిమానాన్ని చాటుకుంటూ.. విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సాయంత్రం 50 మందితో సంగీత విభావరిని కూడా నిర్వహించనున్నారు.