Srikakulam Road Accident: శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ప్యాసింజర్ తుఫాన్ వాహనం ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడు గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. టెక్కలి వైను నుండి శ్రీకాకుళం వైపు వెళ్లే మార్గంలో రోడ్డుపై ఓ లారీ నిలిచి ఉంది. ఒడిశా వైపు నుంచి విశాఖపట్నం వైపు అత్యంత వేగంగా వస్తున్న తుఫాన్ వాహనం ఆగి ఉన్న లారీని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాద ధాటికి తుఫాను వాహనం నుజ్జు నుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించి.. తీవ్రంగా గాయపడిన వారిని అంబులెన్స్ సహాయంతో సమీపంలోని హాస్పిటల్కి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.