E-Paper
Advertisement

Srikakulam Road Accident: లారీ తుఫాన్ ఢీ.. న‌లుగురు దుర్మ‌ర‌ణం

Srikakulam Road Accident: లారీ తుఫాన్ ఢీ.. న‌లుగురు దుర్మ‌ర‌ణం
Advertisement

Srikakulam Road Accident:  శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ప్యాసింజర్ తుఫాన్ వాహనం ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన  కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడు గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. టెక్కలి వైను నుండి శ్రీకాకుళం వైపు వెళ్లే మార్గంలో రోడ్డుపై ఓ లారీ నిలిచి ఉంది. ఒడిశా వైపు నుంచి విశాఖపట్నం వైపు అత్యంత వేగంగా వస్తున్న తుఫాన్ వాహనం ఆగి ఉన్న లారీని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాద ధాటికి తుఫాను వాహనం నుజ్జు నుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించి.. తీవ్రంగా గాయపడిన వారిని అంబులెన్స్ సహాయంతో సమీపంలోని హాస్పిటల్‌కి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

లోకల్ వార్‌పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. కూటమికి ‘స్థానిక’ షాక్ ఇచ్చిన జనసేన!

సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

జనతా పార్టీ నుండి వైసీపీ వరకు.. ముద్రగడ రియల్ స్టోరీ!

అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!

సినిమా సీన్‌ని తలపించేలా నవవధువు కిడ్నాప్.. వీడియో వైరల్!

కొడుకుతో అలా, కూతురితో ఇలా.. వైఎస్సార్ జయంతిలో విజయమ్మ రియాక్షన్..!

వయనాడ్‌లో కొండచరియల బీభత్సం.. సీసీటీవీ దృశ్యాలు!

Big Stories

Advertisement
×