Road Accident: తమిళనాడు శివగంగైలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ప్రభుత్వ బస్సులు ఢీ కొన్న ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. 40 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక అధికారులు వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి తక్షణ చికిత్స అందిస్తున్నారు. స్థానికులు ఫిర్యాదుతో ప్రమాద స్థలానికి పోలీసులు మరియు రక్షణ బృందాలు చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అధికారులు తెలిపారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.