Road Accident: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బీబీనగర్లో హైదరాబాద్-వరంగల్ రహదారిపై థార్ వాహనం బీభత్సం సృష్టించింది. చెరువుకట్ట వద్ద డివైడర్ను ఢీకొని, రోడ్డుపై పక్కన నిల్చున్న యువతి, యువకుడిపై దూసుకెళ్లింది. యువతిని వాహనం ఢీకొనడంతో ఎగిరి పక్కనే ఉన్న చెరువులో పడి మృతి చెందింది. యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. వాహనంలో ఉన్న ముగ్గురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నీటిలో పడిపోయిన యువతి మృతదేహం కోసం గాలిస్తున్నారు. మద్యం మత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని స్థానికులు, పోలీసులు భావిస్తున్నారు.