E-Paper
Advertisement

Guilty Devotee Temple: 55 సంవత్సరాల క్రితం గుడి వద్ద భక్తుడికి దొరికిన ధనం.. దొంగతనంగా ఆ ధనంతో ఎంత పనిచేశాడంటే..

Guilty Devotee Temple: 55 సంవత్సరాల క్రితం గుడి వద్ద భక్తుడికి దొరికిన ధనం.. దొంగతనంగా ఆ ధనంతో ఎంత పనిచేశాడంటే..
Advertisement

Guilty Devotee Temple| తమిళనాడు రాష్ట్రం ఈరోడ్ జిల్లాలోని నెరుంజిపేట్టై గ్రామంలో, అమ్మపేట్టై సమీపంలో ఉన్న చెల్లంది అమ్మన్ దేవాలయం ఒక పవిత్రమైన, శాంతియుతమైన స్థలం. దాదాపు వంద సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఈ ఆలయంలో 55 సంవత్సరాల క్రితం ఒక యువ భక్తుడు సందర్శించాడు. ఆ రోజు, ఆలయంలో సాంబ్రాణి సుగంధం, గంటల శబ్దం, భక్తుల ప్రార్థనలు నిండి ఉన్నాయి. ఆ భక్తుడు ఆలయ ప్రాంగణంలో చెప్పులు లేకుండా నడుస్తూ ఉండగా.. అతడికి ఒక రూ.2 నోటు కనిపించింది. అప్పట్లో రూ.2 అంటే తక్కువ డబ్బులు కాదు.

అయినా ఆ నోటు ఎవరిదో తెలుసుకోవడానికి ఆ భక్తుడు చూశాడు. ఎవరూ దాని కోసం వెతుకుతున్నట్లు కనిపించలేదు. ఆలయ సిబ్బందికి ఇచ్చి, దాని యజమాని వస్తే తిరిగి ఇచ్చేయాలని ఆలోచించాడు. కానీ తరువాత మనసు మార్చుకున్నాడు. బదులుగా, ఆ నోటును తన వద్దనే ఉంచుకున్నాడు. అది తప్పు అని తెలిసినా.. ఆ సమయం అతను అదే సరైనదని భావించాడు. ఆ తరువాత రోజులు, సంవత్సరాలు గడిచాయి. కానీ ఆ చిన్న సంఘటన ఆ భక్తుడి మనసులో మిగిలిపోయింది. రూ.2 అనేది 1970లలో పెద్ద మొత్తం కాదు, కానీ ఆలయంలో చేసిన ఆ చిన్న తప్పు అతని మనస్సాక్షిని కదిలించింది. ఆ రూ.2 నోటు అలా తీసుకోవడం తప్పు అతని లోలోపల అపరాధ భావన కలిగింది. సంవత్సరాలు గడిచినా, ఆ అపరాధ భావన మాత్రం అతనిలో అలాగే ఉండిపోయింది.

Advertisement

కాలం గడిచింది. ఆలయం పాతబడినా, భక్తుల విశ్వాసంతో ఇప్పటికీ బలంగా నిలిచింది. ఆ భక్తుడికి కూడా వయసు మీరింది. కానీ గతంలోని ఆ చిన్న జ్ఞాపకం ఎప్పటికీ మనసులో ఉండిపోయింది. అందుకే ఆ భక్తుడు ఈ అపరాధ భావన నుంచి విముక్తి పొందాలనుకున్నాడు.

55 సంవత్సరాల తర్వాత, ఆ భక్తుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇటీవలే ఒక శుక్రవారం ఉదయం, ఆలయ సిబ్బంది హుండీలను తెరిచి, భక్తులు సమర్పించిన నోట్లను, నాణేలను లెక్కించడం ప్రారంభించారు. ఆలయ సిబ్బంది, అధికారులు.. ఒక హుండీలో వారు ఒక తెల్లని కవరును కనుగొన్నారు.

Advertisement

ఆ కవరులో అన్నీ రూ.500 నోట్లున్నాయి. ఆ మొత్తం రూ.10,000గా ఉన్నట్లు ఆలయ సిబ్బంది గుర్తించారు. అందులో ఒక లేఖ కూడా ఉంది. ఆ లేఖలో ఆ భక్తుడు తన 55 సంవత్సరాల రహస్యాన్ని బయటపెట్టాడు. “55 సంవత్సరాల క్రితం ఆలయంలో రూ.2 నోటు కనిపించింది. దాని యజమానిని కనుగొనలేకపోయాను. ఏం చేయాలో తెలియక ఆ నోటును తీసుకున్నాను. ఆ సంఘటన నన్ను ఇప్పటికీ వెంటాడుతోంది. ఇప్పుడు, నా తప్పును సరిదిద్దడానికి ఈ రూ.10,000 ను ఆలయ హుండీలో సమర్పిస్తున్నాను.” అని ఆ భక్తుడు లేఖలో రాశాడు.

Also Read: అనంత విశ్వంలో మరో భూ గ్రహం.. 154 కాంతి సంవత్సరాల దూరంలో కొత్త సూపర్-ఎర్త్

ఈ లేఖలో పేరు, చిరునామా ఏమీ లేవు. కేవలం నిజాయితీ మాత్రమే. 1970లో రూ.2 నోటు ఇప్పుడు ద్రవ్యోల్బణం ఆధారంగా ఆ ధనం మారక విలువ వస్తువులు కొనగోలు రూపంలో పోల్చి చూస్తే.. ఇప్పుడు దాని విలువు రూ.102గా ఉంది. కానీ ఆ భక్తుడు ఏకంగా రూ.10,000 సమర్పించుకున్నాడు. బహుశా ఆ డబ్బు కంటే, మనసు ప్రశాంతతకే అతను ప్రాధాన్యమిచ్చాడు. ఈ భక్తుడు ఎవరో ఎవరికీ తెలియదు. ఒక పురుషుడో లేక మహిళో స్పష్టత లేదు.

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×