Viral Video: ఇటీవల రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న సర్వేల్లోను ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నట్లు కూడా తేలింది. మద్యం తాగి డ్రైవింగ్ చేయడం, నిద్ర మత్తులో కారు నడపడం, వాహనంలోని లోపాల కారణంగా కూడా ప్రమాదాలు జరగడం, బ్రేకులు ఫెయిల్ అవ్వడం, వేరే వాహనాల కారణంగా కూడా ప్రమాదాలకు గురవ్వడం వంటివి తరచూ చూస్తూనే ఉన్నాం. అయితే ఇలా జరుగుతున్న ప్రమాదాల్లో వాహనాలల్లో ఉన్న వారే కాకుండా రోడ్డుపై ప్రయాణించే వారు కూడా ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం.
ఫుట్ పాత్పై తమ దారిలో తాము నడుస్తున్న కూడా కొంత మందిని మృత్యువు వెంటాడుతుంది. రోడ్డు పక్కన నడుస్తున్న వారిని హఠాత్తున కారు, లారీ వంటి వాహనాలు ప్రమాదాలకు గురిచేస్తున్న ఘటనలకు సంబంధించిన వీడియోలు తరచూ చూస్తూనే ఉన్నాం. ఇలా వాహనాల్లో ఉన్నవారే కాకుండా, రోడ్డుపై నడుస్తున్న పాదచరులు కూడా ప్రమాదాలకు గురవుతున్నారు.
తాజాగా ఫుట్ పాత్పై నడుస్తున్న కొంతమందిని కారు ఢీకొట్టిన ఘటన ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అభం శుభం తెలియని కొందమందిని మృత్యువు ఎంత దారుణంగా వెంటాడిందో కనిపిస్తుంది. కొంతమంది వ్యక్తులు ఫుట్ పాత్పై నడుచుకుంటూ హ్యాపీగా ముచ్చట్లు పెడుతూ వెళ్తున్నారు. ఈ తరుణంలో ఓ కారు రోడ్డుపై వస్తూ అదుపుతప్పింది. దీంతో ఫుట్ పాత్ పై నడుస్తున్న నలుగురు వ్యక్తులను ఢీకొట్టింది. దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. కారు ఢీ కొనడంతో ఎక్కడి వారు అక్కడ గాల్లో ఎగిరి కింద పడిపోయారు. అక్కడే ఉన్న స్థానికులు చూసి షాక్ కు గురయ్యారు. కొంత మంది తృటితో తప్పించుకున్నారు.
ఈ ప్రమాదంకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ప్రమాదంలో గాయాలపాలైన వారు ప్రాణాలు కోల్పోయారా లేక బ్రతికే ఉన్నారా అనే విషయం మాత్రం తెలియరాలేదు. అయితే ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగింది అనే విషయం మాత్రం తెలియరాలేదు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
— Klip Entertainment (@klip_ent) May 7, 2024