BigTV English
Advertisement

Kerala: చోరీకి గురైన బంగారం దొరికింది.. కానీ, 22 ఏళ్ల తర్వాత, అదెలా? కేరళలో అరుదైన ఘటన!

Kerala: చోరీకి గురైన బంగారం దొరికింది.. కానీ, 22 ఏళ్ల తర్వాత, అదెలా? కేరళలో అరుదైన ఘటన!

Kerala Man Receives Stolen Gold:  

కొద్ది మంది జీవితాల్లో కొన్ని అద్భుతాలు జరుగుతాయి. అస్సలు ఊహించని ఘటనలు ఆశ్చర్యానికి గురి చేస్తాయి. కేరళకు చెందిన ఓ వ్యక్తి విషయంలోనూ అచ్చం ఇలాగే జరిగింది. ఈ ఏడాది కృష్ణాష్టమి నాడు  కాయంకుళంకు చెందిన బిజు డేవిడ్ కు కోర్టు నుండి ఊహించని సమన్లు ​​వచ్చాయి. దాదాపు 22 సంవత్సరాల క్రితం  అతడి కుటుంబం పోగొట్టుకున్న బంగారు ఆభరణాలు దొరికాయని, వాటిని తీసుకెళ్లాలని ఆ సమన్లలో రాసి ఉంది. ఈ విషయం తెలియంతో బిజు ఆశ్చర్యపోయాడు.  23 గ్రాముల బరువున్న బంగారం ఇప్పుడు రూ. 2.3 లక్షలకు పైగా విలువ చేస్తుంది. అయితే, వాటిని తన కుమార్తె అంజు ఎలిజబెత్ డేవిడ్కు బహుమతిగా ఇవ్వాలనుకున్నాడు. ఎందుకంటే, ఆమె 5 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తన మీది నుంచే ఆ నగలు దొంగిలించబడ్డాయి.


2003లో బంగారం దొంగతనం

ఆగస్టు 3, 2003 తెల్లవారుజామున, ఒక దొంగ బిజు ఐదు నెలల కుమార్తె నుంచి గాజులు,  పట్టీలు, నడుము గొలుసును దొంగిలించాడు. బిజు దొంగతనం గమనించి అతని చేతులు లాక్కోవడానికి ప్రయత్నించాడు, కానీ ఆ దొంగ వారికి దొరక్కుండా పారిపోయాడు. మరుసటి రోజు అతడు కాయంకుళం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కానీ, పోలీసులు ఆ కేసు విషయంలో ఎలాంటి పురోగతి సాధించలేదు. కొన్ని నెలల తర్వాత, అంబలపుళ పోలీసులు అనేక నేరాలకు పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేశారు. విచారణలో, అతను కాయంకుళం కేసుతో సహా అనేక దొంగతనాలకు పాల్పడ్డాడని ఒప్పుకున్నాడు. “పక్కి సుబైర్ అనే దొంగను తాము పట్టుకున్నామని పోలీసు అధికారి నాకు చెప్పారు. సెంట్రల్ జైలు నుంచి తిరిగి వస్తున్నప్పుడు సుబైర్ ఈ నేరం చేశాడని వెల్లడించాడు” అని కొట్టాయం CMS కళాశాలలో సీనియర్ క్లర్క్ అయిన బిజు గుర్తుచేసుకున్నాడు. సుబైర్ ఇప్పటికే ఆభరణాలను అమ్మేశాడని వెల్లడించాడు. పోలీసులు కొనుగోలుదారుని గుర్తించి, బంగారాన్ని స్వాధీనం చేసుకుని, కాయంకుళం కోర్టుకు సమర్పించారు.

2 దశాబ్దాల తర్వాత చేతికి వచ్చిన బంగారు ఆభరణాలు

ఆ తర్వాత బిజు ఆ ఆభరణాల గురించి పట్టించుకోలేదు. అవి పోయాయని వదిలేశాడు. మూడు సంవత్సరాల క్రితం, అతడు ఈ కేసు గురించి విచారించాడు. నిందితుడు చాలాసార్లు కస్టడీ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించడంతో సుబైర్ స్టేటస్  లాంగ్ పెండింగ్ లో ఉందని తెలుసుకున్నాడు. రెండు నెలల క్రితం, బిజు, అతడి భార్య అనుమోల్ వాంగ్మూలాలను ఇవ్వడానికి కోర్టుకు పిలిచారు. సుమారు 2 దశాబ్దాల తర్వాత వచ్చిన సమన్లు పోయిన బంగారం మీద ​​కొత్త ఆశను తెచ్చిపెట్టాయి. “వ్యవస్థను నమ్మడానికి ఇది ఒక ప్రధాన ఉదాహరణ. చివరకు మేము బంగారాన్ని తిరిగి పొందినందుకు నేను సంతోషంగా ఉన్నాను” అని బిజు అన్నాడు. అంజుకు ఇప్పుడు 22 సంవత్సరాలని, చిత్తూరులోని అపోలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌లో మూడవ సంవత్సరం BSc నర్సింగ్  చదువుతుందన్నాడు. బంగారం దొరికిందని తెలుసుకుని ఆమె తనకు ఫోన్ చేసి, వాటిన దాచిపెట్టాలని చెప్పినట్లు బిజు వెల్లడించాడు.


Related News

Man Wins Rs 240 Cr Lottery: తెలంగాణ బిడ్డకు రూ.240 కోట్ల లాటరీ.. ఇదిగో ఇలా చేస్తే మీరూ కోటీశ్వరులే!

Hanumakonda: కోయ్.. కోయ్.. కొక్కొరొక్కో.. కోళ్ల కోసం జనం పరుగుల వేట

Orange Shark: అరుదైన ఆరెంజ్ షార్క్.. భలే బాగుంది, కానీ చాలా డేంజర్ సుమా!

Safety Pin: ఈ పిన్నీసు కొనాలంటే ఆస్తులు అమ్మాల్సిందే, మరీ అంత ధర ఏంట్రా అయ్యా?

Uber Driver Story: పగటిపూట రూ.1,500 కోట్ల వ్యాపారాన్ని నడుపుతున్న వ్యక్తి, రాత్రిపూట ఉబర్ డ్రైవర్‌గా మారుతున్నాడు.. ఎందుకంటే?

World’s Largest Spider Web: ప్రపంచంలోనే అతి పెద్ద సాలీడు గూడు.. 1,11,000 సాలెపురుగుల నైపుణ్యం.. వీడియో వైరల్

Viral Video: ‘మిషన్ ఇంపాజిబుల్’ సీన్ రీ క్రియేట్, భారత సంతతి యువతి వీడియో నెట్టింట వైరల్!

Viral Video: తెల్లజాతి మహిళకు నల్ల కవలలు, తన పిల్లలు కారంటూ తండ్రి రచ్చ, నెట్టింట వీడియో వైరల్!

Big Stories

×