E-Paper
Advertisement

Viral Video: మెట్రో లైన్‌లో జారిపడ్డ ఇనుప రాడ్డు.. నేరుగా ఆటో ప్రయాణికుడి శరీరంలోకి..

Viral Video: మెట్రో లైన్‌లో జారిపడ్డ ఇనుప రాడ్డు.. నేరుగా ఆటో ప్రయాణికుడి శరీరంలోకి..
Advertisement

Viral Video: మెట్రో నిర్మాణం భద్రతను పక్కన పెట్టిన నిర్లక్ష్యానికి మరోసారి బలయ్యాడు ఓ అమాయకుడు. థానే – భివండి మెట్రో లైన్ – 5 నిర్మాణ స్థలంలో నుంచి జారిపడ్డ ఇనుప రాడ్డు నేరుగా ఓ ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తి తలపై పడింది. రక్తపాతం జరిగిన ఆ ఘటనతో స్థానికులు షాక్ అయ్యారు. ప్రమాద తీవ్రతతో బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా, అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

థానే-భివండి మధ్య నిర్మాణంలో ఉన్న మెట్రో లైన్ 5 వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (MMRDA) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిర్మాణ పనుల్లో అఫ్కాన్స్ ఇన్‌ఫ్రా కంపెనీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఇప్పటికే స్థానికులు, పర్యవేక్షకులు పలుమార్లు హెచ్చరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ నిర్లక్ష్యం వల్లే ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయే స్థితిలోకి వెళ్లిపోయాడు.

Advertisement

ఘటన వివరాల్లోకి వెళితే..
థానే-భివండి మెట్రో నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అయితే, బుధవారం మధ్యాహ్నం సమయంలో భివండి వైపు ఉన్న ఓ నిర్మాణ ప్రాంతంలో ఉన్న మెట్రో స్ట్రక్చర్ నుంచి ఒక్కసారిగా ఓ భారీ ఇనుపరాడ్ కిందకు పడిపోయింది. అదే సమయంలో అక్కడుగా నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తి తలపై అది నేరుగా పడింది. ఆ వ్యక్తి తీవ్రమైన గాయాలతో నేలకూలిపోయాడు. తలపై తీవ్ర గాయం కారణంగా తీవ్ర రక్తస్రావం జరిగింది.

సమీపంలోని ప్రజలు వెంటనే స్పందించి గాయపడిన వ్యక్తిని దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతనికి ప్రాథమిక చికిత్స చేసి వెంటనే ఐసీయూకు షిఫ్ట్ చేశారు. వైద్యుల ప్రకారం బాధితుడి పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని తెలుస్తోంది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఇంతటి భారీ నిర్మాణంలో భద్రతా నియమాలు పాటించకపోవడమే కాకుండా, పాదచారుల రక్షణకు కనీస చర్యలు తీసుకోకపోవడం ప్రమాదాలకు కారణమవుతుందని వారు చెబుతున్నారు.

Advertisement

అఫ్కాన్స్ ఇన్‌ఫ్రా కంపెనీపై ప్రజల్లో ఇప్పటికే అభ్యంతరాలు ఉన్నాయనేది గోప్యతేమీ కాదు. అయితే, ఈ సంఘటన తర్వాత సోషల్ మీడియా ద్వారా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పలువురు నెటిజన్లు #Thane #Mumbai హ్యాష్‌ట్యాగ్‌లతో @MMRDAOfficial ని ట్యాగ్ చేస్తూ ఈ ప్రమాదంపై స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంకైనా మీరెప్పుడైనా ప్రాజెక్ట్ సైట్‌కు వచ్చి, అక్కడ నడుస్తున్న నిర్లక్ష్యాన్ని పరిశీలిస్తారా? అంటూ ఓ నెటిజన్ ప్రశ్నించాడు. మరొకరు.. ఇదేం విధానాలు? మెట్రో పనుల పేరిట ప్రజల ప్రాణాలతో చెలగాటం? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Also Read: SCR Special Trains: చర్లపల్లి నుండి కాకినాడకు స్పెషల్ ట్రైన్.. ఏయే స్టేషన్లలో ఆగుతుందంటే?

ఇదే తరహాలో గతంలోనూ మహారాష్ట్రలో జరుగుతున్న నిర్మాణ పనుల్లో కొన్నిసార్లు రోడ్లు దెబ్బతిన్న ఘటనలు, నిర్మాణ సామాగ్రి కింద ప్రజలు గాయపడిన కేసులు నమోదయ్యాయి. కానీ ఆ ఘటనల నుండి నేర్చుకోకుండా, భద్రతను పక్కనపెట్టి ప్రాజెక్టుల వేగాన్ని మాత్రమే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు ఇలా ప్రాణాలపై ప్రభావం చూపుతున్నాయి. ఈ సందర్భంలో భద్రతకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే విషయంపై MMRDA ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఇలాంటి ఘోర ప్రమాదాలు పునరావృతం కాకుండా చూడాలంటే తక్షణమే చర్యలు అవసరం. నిర్మాణ ప్రదేశాలలో రక్షణ కంచెలు, హెచ్చరికల బోర్డులు, ప్రజల రాకపోకల నియంత్రణ, పనుల్లో నిపుణుల పర్యవేక్షణ వంటి అంశాలను పాటించకపోతే, ప్రతి ప్రాజెక్ట్ ఒక ప్రమాద కేంద్రంగా మారే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో బాధితుడికి న్యాయం చేయడమే కాకుండా, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అఫ్కాన్స్ ఇన్‌ఫ్రా లాంటి సంస్థలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ప్రస్తుతం గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ ఉన్న ఆసుపత్రిలో పోలీసులు విచారణ చేపట్టారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అక్కడి కార్మికుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. నిర్మాణాన్ని నిర్వహిస్తున్న కంపెనీ అధికారులను కూడా విచారించనున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, బాధితుడి కుటుంబ సభ్యులకు పూర్తి సహాయం అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

ఈ సంఘటన మరొకసారి మెట్రో నిర్మాణాల్లో జరుగుతున్న నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. నగర అభివృద్ధి ఎంత అవసరమై ఉంటే, అదే స్థాయిలో ప్రజల ప్రాణ భద్రతకూ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్న విషయం మళ్లీ గుర్తు చేస్తోంది.

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×