E-Paper
Advertisement

Train Accident: రైలు ఢీకొని 5 కి.మీలు ఈడ్చుకుంటూ వచ్చిన మృతదేహం..వీడియో వైరల్

Train Accident: రైలు ఢీకొని 5 కి.మీలు ఈడ్చుకుంటూ వచ్చిన మృతదేహం..వీడియో వైరల్
Advertisement

Warangal to Secbad Train Accident: మేడ్చల్ జిల్లాలోని ఘట్‌కేసర్‌లో రైలుకు వేలాడుతూ వచ్చిన మృతదేహం భయాందోళనకు గురిచేసింది. రైలు పట్టాలు దాటుతున్న ఓ వృద్ధుడిని రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆ వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఆ మృతదేహం రైలు ఇంజిన్ ముందు భాగంలో చిక్కుకోవడంతో ప్రమాదం జరిగిన సంఘటన నుంచి ఘట్‌కేసర్ వరకు సుమారు 5 కిలోమీటర్లు అలాగే వేలాడుతూ వచ్చింది.

ఘట్‌కేసర్ ప్రాంతంలో రైల్వే గేట్ పడగా.. రైలుకు మృతదేహం వేలాడుతూ రావడాన్ని చూసిన వాహనదారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. మృతదేహాన్ని చూసి వెంటనే అధికారులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన రైల్వే పోలీసులు రైలును ఆపి మృతదేహాన్ని బయటకు తీశారు.

Advertisement

బీబీనగర్, ఘట్ కేసర్ రైల్వే స్టేషన్ మధ్య వృద్ధుడు రైలు దాటేందుకు ప్రయత్నం చేశాడని, ఇంతలో వరంగల్ నుంచి వస్తున్న ప్యాసింజర్ రైలు ఢీకొట్టినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో వృద్ధుడు రైలు ముందు భాగానికి చిక్కుకోవడంతో సుమారు 5 కిలోమీటర్ల మేరకు వేలాడుతూ వచ్చిందని తెలిపారు. మృతి చెందిన వృద్ధుడు నీలం రంగు చొక్కాఆరెంజ్ లుంగీ, కుడిచేతికి కడియం ధరించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. కాగా, ప్యాసింజర్ రైలు..వరంగల్ నుంచి సికింద్రాబాద్ వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.

Also Read: తల్లి ముందే కూతురుని కారుతో తొక్కేసిన వీడియో వైరల్..

Advertisement

ఈ ప్రమాదంపై రైల్వే అధికారులు అలర్ట్ జారీ చేశారు. రైలు వస్తున్న సమయంలో తొందరపడి పట్టాలు దాటేందుకు రాకూడదన్నారు. కొన్ని సమయాల్లో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. రైల్వే పట్టాలకు సమీపంలో ఉండే వ్యక్తులు ఇతర మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.

Tags

Related News

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

Big Stories

Advertisement
×