E-Paper
Advertisement

Viral Video: పావురాలతో భయం.. బుక్కైన యువకులు, వైరల్ వీడియో

Viral Video: పావురాలతో భయం.. బుక్కైన యువకులు, వైరల్ వీడియో
Advertisement

Viral Video: టెక్ యుగంలో డబ్బులు సంపాదించడానికి యువత వేర్వేరు మార్గాలు ఎంచుకుంటున్నారు. కాకపోతే పైన కనిపిస్తున్న వ్యక్తులు ఆ రకం కాదు. ప్రజల్లో భయాందోళనను క్రియేట్ చేయాలని చూశారు. చివరకు పోలీసుల దృష్టిలో పడ్డారు, అడ్డంగా బుక్కయ్యారు. అసలేం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

మంత్రాలకు చింతకాయలు రాలవు.. కానీ ఇద్దరు యువకులు ఆ గ్రామ ప్రజలను నమ్మించి, భయపెట్టే ప్రయత్నం చేశారు. ఆ విషయంలో కొంతమేరా సక్సెస్ అయ్యారు. అనుకోని పరిస్థితుల్లో పోలీసులకు దొరికిపోయారు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.

Advertisement

యూపీలోని ముజఫర్ నగర్ జిల్లాలో వింత కుట్ర బయటపడింది. కాకరోలి పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. పావురాళ్లతో స్థానికుల్లో భయాన్ని వ్యాప్తి చేయడానికి ప్లాన్ చేశారు షోయబ్-షకీబ్మ్ అనే ఇద్దరు వ్యక్తులు. పావురాల కాళ్ళకు- మెడకు LED లైట్లను కట్టి వాటిని చీకటిలో ఎగురేసేవారు.

తద్వారా ఆకాశంలో మెరుస్తున్న లైట్లను సీక్రెట్ డ్రోన్లుగా చూపెట్టి భయపెట్టే ప్రయత్నం చేశారు. రాత్రివేళ ఎరుపు, ఆకుపచ్చ లైట్లతో కొన్ని డ్రోన్‌లు రాత్రి వేళ ఆకాశంలో ఎగురుతున్నట్లు పుకారు క్రియేట్ చేశారు. దీనివల్ల ఆయా గ్రామాల్లో ప్రజలు భయపడ్డారు. చీకటి పడితేచాలు ఇంట్లో నుంచి బయటకు రావడానికి భయపడేవారు.

Advertisement

ALSO READ: చైనాలో రోడ్లపైకి జనాలు.. 20 కేజీల బంగారు కోసం వెతుకులాట

వారి భద్రత కోసం కాపలాదారులను నియమించుకున్నారు. రాత్రి సమయంలో ఆకాశంలో ఎరుపు-ఆకుపచ్చ లైట్లు మెరుస్తున్నట్లు కనిపిస్తోందని స్థానికులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, వాటిని గమనించడం మొదలుపెట్టారు. మెరుస్తున్న లైట్లను గమనించి వెంబడించారు.  ఆ లైట్ల పావురాలు పొలాలు, అటవీ ప్రాంతం వైపు కదులుతున్నట్లు గుర్తించారు.

అప్పటికే పోలీసులకు అనుమానం వచ్చింది. దీనిపై లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఆ లైట్లు.. డ్రోన్ల నుంచి కాదని పావురం నుండి వస్తోందని నిర్థారించారు. ఎవరు వీటిని ఎగుర వేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? అన్నది ప్రశ్నగా మారింది. ఆ గ్రామానికి వచ్చిన పోలీసులు సీక్రెట్‌గా పావురాళ్ల డ్రోన్ల గురించి గమనించడం మొదలుపెట్టారు.

ఇద్దరు యువకులు పావురాలను ఎగుర వేసే క్రమంలో అదుపులోకి తీసుకున్నారు. పావురాల కాళ్ళు, మెడలకు LED లైట్లు కట్టి ఉన్నాయి. ఉద్దేశపూర్వకంగా పావురాలను ఎగురవేసినట్టు చెప్పారు. ప్రజలను కావాలనే భయపెట్టాలని నిర్ణయించుకున్నట్లు తేలింది. దీనికి సంబంధించిన సామగ్రిని ఢిల్లీ నుండి తెప్పించారు. నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు పోలీసులు.

 

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×