E-Paper
Advertisement

Viral Video: రీల్స్ కోసం తెగించిన యువకుడు.. ఏకంగా ట్రైన్ క్రింద

Viral Video: రీల్స్ కోసం తెగించిన యువకుడు.. ఏకంగా ట్రైన్ క్రింద
Advertisement

Viral Video: ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ పిచ్చితో యువత చెలరేగిపోతున్నారు. సోషల్ మీడియాలో రాత్రికి రాత్రి వైరల్ అవ్వడం కోసం.. కొంత మంది యువత వెర్రి చేష్టలతో రీల్స్ చేస్తున్నారు. వారు ఫేమస్ కావాలని నేపథ్యంలో.. వారి ప్రాణాలను పణంగా పెట్టడుతున్నారు. ఇప్పటికే స్టంట్స్ రీల్స్ చేస్తూ.. కొంత మంది యువత ప్రాణాలు కోల్పోయిన ఘటనలు నిత్యం మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో తాజాగా ఓ యువకుడు రైల్వే ట్రాక్‌పై ప్రమాదకర సంస్ట్‌కు.. నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియో మంగళవారం ఉదయం ఎక్స్ వేదికగా టీజీఎస్ఆర్టీసీ ఎండీ, వీసీ సజ్జనార్ (VC Sajjanar) పోస్ట్ చేశారు. వీడియోలో ఓ యువకుడు రైలు వెళ్తుండగా ట్రాక్ మధ్యలో నిలువుగా పడుకొని, రైలు దగ్గరగా వస్తున్న సమయంలో.. వీడియోను రికార్డ్ చేసాడు. ఇది సోషల్ మీడియా వేదికలపై వైరల్ అయ్యింది.

దీనిపై వీసీ సజ్జనార్ ట్వీట్ చేస్తూ.. సోషల్ మీడియాలో పేమ్ కోసం.. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా.. యువత ఇలాంటి ప్రమాదకర పనులు చేస్తున్నారు. రీల్స్ చేసి ఇప్పటికిప్పుడే ఫేమస్ కావాలనే తాపత్రయమే తప్ప.. ఎలాంటి వీడియోలు చేస్తున్నామనే ఆలోచన కూడా చేయడం లేదు. ప్రమాదం జరిగితే తల్లితండ్రులు ఎంతటి క్షోభను అనుభవిస్తారనే.. సోయి కూడా వీరికి ఉండటం లేదు. సోషల్ మీడియా మత్తులో పడిన ఇలాంటి మానసిక రోగులకు కౌన్సిలింగ్ అత్యవసరం. లేకుంటే వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయని.. వీళ్లు ఇంకా మరెన్నో వెర్రి పనులు చేసే ఆస్కారం ఉందని పేర్కొన్నారు.

Advertisement

సోషల్ మీడియాలో ఫేమస్ కోసం పిచ్చి పరాకాష్టకు చేరిందని ఇలాంటి వారిని అరెస్ట్ చేయాలని రైల్వే శాఖ, ఆర్‌పీఎఫ్ సిబ్బందికి ఎక్స్ వేదికగా నెటిజన్లు ట్యాగ్ చేశారు. ఇలాంటి వాళ్లను మీరు తప్పనిసరిగా అరెస్ట్ చేయాలని, లేకపోతే వీడిని చూసి ఇంకో పది మంది ఇలా చేస్తారని పలువురు నెటిజన్‌లు కామెంట్స్ పెట్టారు.

సామాజిక మాధ్యమాల వాడకాన్ని తప్పుపెట్టలేము. అది ఒక మంచి వేదిక, ప్రతిభను పరిచయం చేసే గొప్ప సాధనం. కానీ ఆ వేదికను మనం ఎలా వాడుకుంటున్నామన్నదే ప్రశ్న. యువత సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసం రీల్స్ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం పొందాలంటే ఒక్కటే మార్గం.. స్కూల్స్‌, కాలేజీల్లో ఈ విషయంలో విద్యార్థులకు అవగాహన కల్పించాలి. తల్లిదండ్రులు తమ పిల్లల ఆన్‌లైన్ యాక్టివిటీపై కొంతశాతం దృష్టిపెట్టాలి. సోషల్ మీడియా సంస్థలు తమ ప్లాట్‌ఫార్మ్‌లలో.. ప్రమాదకర కంటెంట్‌ను ప్రోత్సహించకుండా కఠిన నియమాలు విధించాలి.

Advertisement

Also Read: మనిషిలాగా ప్రవర్తించిన బుల్లి ఏనుగు.. కుర్చీలో కూర్చునేందుకు ప్రయత్నించి..?

రీల్‌కు వచ్చిన లైకుల కంటే, మీ జీవితమే విలువైనది. ఒక్క వీడియో వైరల్ కావడానికి తీసే ఓ చిన్న పొరపాటు, జీవితాంతం శోకాన్ని మిగిలించవచ్చు. రియల్ లైఫ్‌కి మించినది రీల్ కాదని ప్రతి యువకుడు గుర్తుంచుకోవాలి. రీల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉండాలి కానీ.. ప్రాణాలను పణంగా పెట్టే మోజుగా కాకూడదు.

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×