E-Paper
Advertisement

IT Unit Vishaka : హైదారాబాద్‌కి సైబర్ టవర్స్.. విశాఖలో ఐటీ టవర్ – సాగర తీరం నుంచే ఐటీలో పోటీ

IT Unit Vishaka : హైదారాబాద్‌కి సైబర్ టవర్స్.. విశాఖలో ఐటీ టవర్ – సాగర తీరం నుంచే ఐటీలో పోటీ
Advertisement

IT Unit Vishaka : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖ ను ఐటీకి కేంద్రంగా మార్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ నగరం  నుంచి ఐటీ కార్యకలాపాలను విస్తృతం చేయాలని భావిస్తున్నారు. అద్భుతమైన ప్రకృతి సౌందర్యాలతో పాటు భారీగా ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండటంతో ఈ ప్రాంతాన్ని ఏపీ ఐటీ కారిడార్ గా మార్చాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే.. విశాఖలో వాతావరణం కూడా బాగుండడం కలిసొచ్చే అంశం. కాగా.. అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులకు అనువైనం ప్రదేశంగా విశాఖను చూపిస్తోంది కూటమి ప్రభుత్వం. అందుకు తగ్గట్టుగానే ఐటీ కోసం సరికొత్తగా ఐకానిక్ భవనాన్ని సిద్ధం చేస్తోంది.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్ లో ఐటీ సంస్థల కోసం హైటెక్ హంగులతో సైబర్ టవర్స్ ను నిర్మించించారు. హైదరాబాద్ చరిత్రలో సైబర్ టవర్స్ ఓ ప్రత్యేక అధ్యయంగా నిలిచిపోతుంది. నగరానికి వచ్చే ఐటీ సంస్థలకు, పూర్తి ఐటీ పరిశ్రమకు గుర్తుగా ఆ భవనం నిలిచిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు సరిగా అలాంటి ఐకానిక్ బిల్డింగ్ నే ఏపీలోని విశాఖలో నిర్మిస్తున్నారు.

Advertisement

దావోస్ పర్యటనలో డేటా సెంటర్, గ్లోబల్ బిజినెస్ సెంటర్, ఏఐ అభివృద్ధి కేంద్రం, గ్లోబల్ క్యాపబుల్ సెంటర్ వంటివి ఏర్పాటు చేయాలంటూ ఆయా సంస్థలతో చర్చలు జరిపారు. ఆ సంస్థలు రాష్ట్రంలో ఉన్న వసతులు, విస్తరణ అవకాశాల్ని పరిశీలించడంతో పాటు.. ప్రభుత్వం అందించే సదుపాయాలను పరిగణలోకి తీసుకొని పెట్టుబడులు పెడతాయి. అందుకే.. అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించేందుకు.. వారికి కావాల్సిన వసతుల్ని సమకూర్చేందుకు.. విశాఖ మహా ప్రాంత అభివృద్ధి సంస్థ (VMRDA) ఓ ఐకానిక్ భవనాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ భవనం పనులు దాదాపు పూర్తిగాక.. ఫిబ్రవరి మొదటి వారంలో సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు.

సువిశాలమైన ఆఫీస్ స్పేస్ తో పాటు ఏకంగా ఐదు అంతస్తుల్లో కార్ల పార్కింగ్ సౌకర్యంతో ఈ భవనం సిద్ధమవుతోంది. నగరం నడిబొడ్డున నిర్మిస్తున్న ఈ ఐకానిక్ బిల్లింగ్ ను పదకొండు అంతస్తులుగా డిజైన్ చేయగా.. అందులో మొదటి 5 అంతస్తుల్లోని 1.90 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని కేవలం పార్కింగ్ కోసమే కేటాయించారు. మిగతా ఆరు అంతస్తుల్లోని 1.65 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని  ఆఫీస్ స్పేస్ గా అందుబాటులోకి తీసుకురానున్నారు. అత్యాధునిక సౌకర్యాలు, పార్కింగ్ వసతులతో తీర్చిదిద్దిన ఈ భవనంలో.. గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా డిజైన్ చేశారు.

Advertisement

Also Read : రాజమండ్రి విమానాశ్రయంలో ప్రమాదం..

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికే ముందుకొచ్చే టెక్ సంస్థలకు ఈ భవనంలోనే ఆఫీస్ స్పేస్ కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సువీశాల ఆఫీస్ స్పేస్ అందుబాటులో ఉండటంతో జిసిసిలకు, బహుళ జాతి సంస్థకు అనువుగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే.. నగరానికి నడిబొడ్డున ఉన్న భవనంలో  టెక్ సంస్థల కార్యకలాపాలు మొదలయితే.. విశాఖకు సరికొత్త గుర్తింపు సొంతమవుతుందని ప్రభుత్వం భావిస్తుంది.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×