E-Paper
Advertisement

Fake Currency Busted: హైదరాబాద్‌లో రూ.5లక్షల ఫేక్ కరెన్సీ.. నిందితుడు ARREST..!

Fake Currency Busted: హైదరాబాద్‌లో రూ.5లక్షల ఫేక్ కరెన్సీ.. నిందితుడు ARREST..!
Advertisement

Fake Currency Busted: రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఫేక్ కరెన్సీ ముఠా గుట్టురట్టు అయ్యింది. తుక్కుగూడ ఏరియాలో దొంగనోట్లు తయారు చేస్తున్నవ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.5లక్షల ఫేక్ కరెన్సీ, ప్రింటింగ్ మిషన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

దీనిపై రాచకోండి సీపీ సుధీర్ బాబు మీడియాతో మాట్లాడారు. మహబూబ్ నగర్, కర్నూల్ జిల్లాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు కలిసి ఫేక్ కరెన్సీకి పాల్పడినట్లు తెలిపారు. ఫేక్ కరెన్సీ తయారు చేస్తున్న ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసి.. ఫేక్ ప్రింటింగ్ మిషన్‌ను సీజ్ చేశామన్నారు. నిందితులు ఒరిజినల్, నకిలీ నోట్లు గుర్తు పట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పారు. జీఎస్-45 అనే పేపర్‌పై ప్రింట్ చేసి ఫేక్ కరెన్సీ ముద్రించే ప్రయత్నం చేశారని తెలిపారు.

Advertisement

Also Read: Jobs in Indian Oil Corporation: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో 456 పోస్టులు.. వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గుజరాత్, కోల్‌కత్తా‌కు చెందిన వ్యక్తులతో నిందితులు డీల్ కుదుర్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు. రూ.లక్ష ఫేక్ కరెన్సీ ముద్రిస్తే.. రూ.10వేలు ఇచ్చేలా డీల్ కుదర్చుకున్నట్లు సీపీ సుధీర్ బాబు తెలిపారు. రెండు పేపర్లు ఒకదానికొకటి కలిపి థిక్ నెస్ వచ్చేలా ఫేక్ కరెన్సీ ముద్రించారని పేర్కొన్నారు. హై ప్రింటింగ్ వాల్యూతో స్కానింగ్ చేసే ప్రయత్నం చేశారని అన్నారు. అయితే ఆ ఫేక్ కరెన్సీ నోట్లు సర్క్యులేషన్‌లోకి రాలేదని తెలిపారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Related News

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

Big Stories

Advertisement
×