E-Paper
Advertisement

Markapuram : ప్రకాశం జిల్లాలో దారుణం.. పోలీస్ స్టేషన్ ఎదుటే యువకుడి ఆత్మహత్యయత్నం..

Markapuram : ప్రకాశం జిల్లాలో దారుణం..   పోలీస్ స్టేషన్ ఎదుటే యువకుడి ఆత్మహత్యయత్నం..
ap news today telugu

Markapuram news(AP news today telugu):

సంబంధం లేని గొడవలో తనను తీసుకెళ్లి పోలీసులు తివ్రంగా కొట్టారంటూ మనస్తాపానికి గురైన ఓ యువకుడు పోలీస్ స్టేషన్ ఎదుటే పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన బుధవారం సాయంత్రం ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ వద్ద చోటు చేసుకుంది.

బాధితుడి కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. యర్రగొండపాలెంలోని గాయత్రి సినిమా హాలు సమీపంలో నాగెపోగు నరసింహారావు కుటుంబం నివాసముంటుంది. వారి కుమారుడు మోజేష్ (19) దూరవిద్యలో డిగ్రీ చదువుతున్నాడు. మంగళవారం ఉదయం మాచర్ల రోడ్డులోని రాళ్లవాగు వంతెన పక్కన కొందరు యువకులు గొడవ పడ్డారు. పోలీసులు వెళ్లి.. ఆ సమయానికి అక్కడున్న మోజేష్, సుభానినీ స్టేషన్ కు తీసుకొచ్చారు. ఎస్సై రాజేష్ వారిని తీవ్రంగా కొట్టారు. మోజేష్ తండ్రిని పిలిచి ఇష్టమొచ్చినట్లు దూషించారు. అదేరోజు రాత్రి వారిని ఇంటికి పంపిచిన పోలీసులు బుధవారం మళ్లీ రమ్మని చెప్పారు. బుధవారం ఉదయం సైతం కొట్టి, తన తండ్రిని ఎస్సై, సీఐ ఇష్టమొచ్చినట్లు దుర్బాషలాడటంతో మోజేష్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇంటికెళ్లి పెట్రోల్ తెచ్చుకొని పోలీసు స్టేషన్ ఆవరణలో ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు. మంటలు అంటుకోవడంతో కేకలు వేస్తూ స్టేషన్ నుంచి బయటకొచ్చి ఎదురు వీధిలోని నీళ్ల డ్రమ్ములో దూకాడు.

ఎస్సై రాజేష్, సిబ్బంది హుటాహుటిన మోజేష్‌ను మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మోజేష్ శరీరం దాదాపు 50 శాతం కాలిపోయినట్లు వైద్యులు తెలిపారు. అంనతరం అక్కడ్నుంచి మార్కాపురంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ పరిశీలించిన వైద్యులు మెడికో లీగల్ కేసు కట్టకుండా వైద్యం చేయలేమని చెప్పడంతో బాధిత కుటుంబసభ్యులతో రాజీకి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అకారణంగా తమ బిడ్డను పోలీసులు కొట్టడంతోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడంటూ బాధిత కుటుంబసభ్యులు, బంధువులు పోలీసు స్టేషన్ ముందున్న జాతీయ రహదారిపై రాత్రి వేళ బైఠాయించి నిరసన తెలిపారు. ఘటనపై మార్కాపురం DSP ఎర్రగొండపాలెంనికి చేరుకొని విచారిస్తున్నారు.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×