Big Stories

7 People Died in AP Road Accident: ఏపీలో రోడ్డు ప్రమాదాలు.. విశాఖ, కృష్ణా జిల్లాల్లో ఏడుగురు మృతి!

Road Accidents in Andhra Pradesh
Road Accidents in Andhra Pradesh

Seven People Died in AP Road Accident in Single Day: విశాఖ జిల్లా పెందుర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో స్పాట్‌లో ముగ్గురు మృతి చెందారు. మరో పది మందికి తీవ్రగాయాలయ్యాయి. మృతులంతా పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన పెందుర్తిలోని అక్కిరెడ్డిపాలెం వద్ద చోటు చేసుకుంది.

- Advertisement -

టాటా ఏసీ వ్యాన్‌ను వేగంగా వచ్చిన ఓ లారీ ఢీ కొట్టింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి పేర్లు హనుమంతు ఆనందరావు (45), హనుమంతు శేఖర్ రావు (15), చింతాడి ఇందు (65).

- Advertisement -

మరోవైపు పాడేరు ఘాట్ రోడ్డు లోయలోకి దూసుకెళ్లింది బొలెరో వాహనం. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఏసు ప్రభు కార్నర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. మృతులిద్దరూ వలస కూలీలు. ఒడిషా నుంచి విజయవాడ వైపు వస్తున్నారు. దాదాపు 30 మందితో బొలెరో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది.క్షతగ్రాతులను పాడేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇదిలావుండగా కృష్ణా జిల్లా ఘంటసాల మండలం లంకపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. గురువారం ఉదయం జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని బైక్ ఢీ కొట్టింది. బైక్‌పై ప్రయాణిస్తున్న భార్యభర్తలు స్పాట్‌లో మృతి చెందారు. మృతులు చల్లపల్లి మండలం పచ్చర్లంక వాసులుగా గుర్తించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News