Gold and Diamonds Seized in Kodikonda: ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి.. ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. అనుమానంగా ఉన్న ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో శ్రీ సత్యసాయి జిల్లా కోడికొండ చెక్ పోస్టు వద్ద నిర్వహించిన తనిఖీల్లో భారీగా వజ్రాలు, బంగారు ఆభరణాలు పట్టుబడ్డాయి. చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తుండగా.. భారీగా వజ్రాలు, బంగారు ఆభరణాలు కనిపించాయి. వాటి విలువ సుమారు 30 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.
Also Read: పవన్ వారాహి యాత్ర వాయిదా.. మూడ్రోజులు పిఠాపురంలోనే మకాం
సోమవారం ఉదయం పట్టుకున్న వాహనాన్ని సాయంత్రం వరకూ చిలమత్తూరు పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. జిల్లా ఉన్నతాధికారులు, కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు ఈ మేరకు సమాచారం అందించారు. పీఎస్ కు చేరుకున్న ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జేసీ అభిషేక్, తహసీల్దార్, కమర్షియల్ ట్యాక్స్ అధికారులు పత్రాలను పరిశీలించారు. అనంతరం వాహనాన్ని వదిలివేయనున్నట్లు అధికారులు తెలిపారు. వాహనానికి సాయుధ బలగాలతో భద్రత కల్పించారు.