E-Paper
Advertisement

Anantapur : ఏడేళ్లకు పుట్టిన బిడ్డ.. బలితీసుకున్న నిమ్మకాయ

Anantapur : ఏడేళ్లకు పుట్టిన బిడ్డ.. బలితీసుకున్న నిమ్మకాయ
This image has an empty alt attribute; its file name is ac6193b09fae0172148bf0b93e06390c.jpg

Anantapur : ముక్కు పచ్చలారని చిన్నారిని నిమ్మకాయ బలిగొంది. ఈ ఘటన అనంతపురం జిల్లాలోని పెద్దవడుగూరు మండలం మల్లేనిపల్లిలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గోవిందరాజు, దీప అనే దంపతులకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. ఏడేళ్ల తరువాత చిన్నారి జస్విత జన్మించింది. 9 నెలలు చిన్నారి బుధవారం సాయంత్రం ఆడుకుంటూ ఉన్నట్టుండి నిమ్మకాయ నోట్లో పెట్టుకుంది. గొంతులో ఇరుక్కుపోయిన నిమ్మకాయను తీయడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నించారు.

సాధ్యం కాకపోవడంతో పెద్దవడుగూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు కూడా పాప గొంతులో ఇరుక్కున్న నిమ్మకాయను బయటకు తీయలేకపోయారు. దీంతో 108 వాహనంలో అనంతపురం నుంచి పామిడిలో ఉన్న ఒక ప్రైవేట్ డాక్టర్ వద్ద చూపించారు. కానీ.. అప్పటికే చిన్నారి శ్వాస ఆగిపోయిందని డాక్టర్ తెలిపారు. అక్కడి నుంచి పామిడి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చూపించగా.. వైద్యులు చిన్నారి మృతి చెందినట్లు ధ్రువీకరించారు. పెళ్లైన ఏడేళ్లకు.. లేకలేక పుట్టిన పాపను అల్లారుముద్దుగా చూసుకుంటున్న తల్లిదండ్రులకు కడుపుశోకం మిగిలింది. ఒక్కగానొక్క కూతురు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×