E-Paper
Advertisement

Anantapur : ఏడేళ్లకు పుట్టిన బిడ్డ.. బలితీసుకున్న నిమ్మకాయ

Anantapur : ఏడేళ్లకు పుట్టిన బిడ్డ.. బలితీసుకున్న నిమ్మకాయ
Advertisement
This image has an empty alt attribute; its file name is ac6193b09fae0172148bf0b93e06390c.jpg

Anantapur : ముక్కు పచ్చలారని చిన్నారిని నిమ్మకాయ బలిగొంది. ఈ ఘటన అనంతపురం జిల్లాలోని పెద్దవడుగూరు మండలం మల్లేనిపల్లిలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గోవిందరాజు, దీప అనే దంపతులకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. ఏడేళ్ల తరువాత చిన్నారి జస్విత జన్మించింది. 9 నెలలు చిన్నారి బుధవారం సాయంత్రం ఆడుకుంటూ ఉన్నట్టుండి నిమ్మకాయ నోట్లో పెట్టుకుంది. గొంతులో ఇరుక్కుపోయిన నిమ్మకాయను తీయడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నించారు.

సాధ్యం కాకపోవడంతో పెద్దవడుగూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు కూడా పాప గొంతులో ఇరుక్కున్న నిమ్మకాయను బయటకు తీయలేకపోయారు. దీంతో 108 వాహనంలో అనంతపురం నుంచి పామిడిలో ఉన్న ఒక ప్రైవేట్ డాక్టర్ వద్ద చూపించారు. కానీ.. అప్పటికే చిన్నారి శ్వాస ఆగిపోయిందని డాక్టర్ తెలిపారు. అక్కడి నుంచి పామిడి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చూపించగా.. వైద్యులు చిన్నారి మృతి చెందినట్లు ధ్రువీకరించారు. పెళ్లైన ఏడేళ్లకు.. లేకలేక పుట్టిన పాపను అల్లారుముద్దుగా చూసుకుంటున్న తల్లిదండ్రులకు కడుపుశోకం మిగిలింది. ఒక్కగానొక్క కూతురు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×