A Doctor suicide: శ్రీకాళహస్తిలో దారుణం చోటు చేసుకుంది. మరి ఏమైందో తెలీదుగానీ అర్ధరాత్రి భర్తతో గొడవపడ్డారు డాక్టర్ అశ్విని. తెల్లవారేసరికి సూసైడ్ చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అసలేం జరిగింది? ఇంకా లోతుల్లోకి వెళ్దాం.
శ్రీకాళహస్తి టౌన్లోని కొత్తపేటలో ఉంటున్నారు డాక్టర్ అశ్విని. ఆమె వయస్సు 35 ఏళ్లు. ఎనిమిదేళ్ల కిందట వ్యాపారవేత్త సీతారామరెడ్డి కొడుకు రాజేష్తో వివాహం జరిగింది. స్థానికంగా ఓ క్లినిక్ కూడా ఉంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇద్దరు చదువుకున్న వాళ్లు కావడంతో కాపురం అంతా సజావుగా సాగుతోంది. పిల్లలతో ఇళ్లంతా సందడిగా ఉండేది. అయితే వీళ్లిద్దరి మధ్య గొడవులు ఎప్పుటి నుంచి జరుగుతున్నాయో తెలీదుగానీ, రాత్రి టిఫిన్ విషయంలో దంపతుల మధ్య గొడవ జరిగింది.
భార్యాభర్తల మధ్య మాటలు హద్దులు దాటాయి. మెల్లగా గొడవకు ఫుల్స్టాప్ పడింది. అశ్విని తన రూమ్కి వెళ్లిపోయారు. తెల్లవారేసరికి ఆమె ఫ్యాన్కు ఉరేసుకున్నారు. ఉదయం ఆమె కూతురు తలుపు ఎంత కొట్టినా తీయలేదు. చివరకు ఫ్యామిలీ సభ్యులకు చెప్పింది. ఈలోగా కిటికీలో నుంచి చూడగా ఫ్యాన్కు ఉరేసుకున్నారు. అశ్వినిని విగతజీవిగా ఉండడాన్ని చూసి కేకలు వేయడంతో కుటుంబసభ్యులు తలుపులు పగలగొట్టి పరిశీలించారు.
ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు పరిసరాలను పరిశీలించిన కొన్ని పేపర్స్ స్వాధీనం చేసుకున్నారు. అశ్విని భర్త రాజేష్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అశ్విని డెడ్బాడీని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరి పోలీసుల విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.
రాత్రి భర్తతో గొడవ.. తెల్లవారేసరికి ఆత్మహత్య!
శ్రీకాళహస్తిలో డాక్టర్ అశ్విని అనుమానాస్పద మృతి.. పోలీసుల అదుపులో భర్త రాజేశ్.
శ్రీకాళహస్తిలో అశ్విని క్లినిక్ అండ్ డే కేర్ హాస్పిటల్ నడుపుతున్న ప్రముఖ వ్యాపారవేత్త సీతారామరెడ్డి కొడుకు రాజేశ్ రెడ్డి, అతని భార్య అశ్విని. నిన్న… pic.twitter.com/lR0daizp5i
— BIG TV Breaking News (@bigtvtelugu) April 25, 2024